Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Health Tips : ఈ చేప రుచి అదుర్స్.. కొరమీను, రావును మించిన పోషకాలు.. ధర కూడా తక్కువే.. ఒకసారి ట్రై చేయండి

6 June 2026

అరుదైన గ్రహాల కలయిక.. వీరికి గోల్డెన్ టైం స్టార్ట్.. జీవితాన్ని మార్చే శుభ సమయం ఇదే

6 June 2026

Video: రోడ్డుపై ఓ మూటతో నిల్చున్న వ్యక్తి.. ఆటోను ఆపి డ్రైవర్‌ను పిలిచాడు.. సీన్ కట్‌చేస్తే.. ట్విస్ట్ మాములుగా లేదుగా..!

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Minister Nimmala Ramanaidu Farming,వ్యవసాయం చేస్తోన్న ఏపీ మంత్రి.. సొంత పొలంలో ట్రాక్టర్ స్టీరింగ్ పట్టి – ap minister nimmala ramanaidu farming work on his own land in palakollu
ఆంధ్రప్రదేశ్

Ap Minister Nimmala Ramanaidu Farming,వ్యవసాయం చేస్తోన్న ఏపీ మంత్రి.. సొంత పొలంలో ట్రాక్టర్ స్టీరింగ్ పట్టి – ap minister nimmala ramanaidu farming work on his own land in palakollu

.By .1 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Minister Nimmala Ramanaidu Farming,వ్యవసాయం చేస్తోన్న ఏపీ మంత్రి.. సొంత పొలంలో ట్రాక్టర్ స్టీరింగ్ పట్టి – ap minister nimmala ramanaidu farming work on his own land in palakollu
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Nimmala Ramanaidu Tractor Farming: ఏపీ జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ట్రాక్టర్ స్టీరింగ్ పట్టారు. సొంత నియోజకవర్గమైన పాలకొల్లులోని తన నివాసం నుంచి 7 కిలోమీటర్లు సైకిల్‌పై సొంత ఊరు ఆగర్తిపాలెం వెళ్లారు. అక్కడ తన పొలానికి వెళ్లి దుక్కి దున్నారు. అలాగే ఆయన రొయ్యల చెరువుల్ని కూడా పరిశీలించారు.. అనంతరం రొయ్యలకు మేత కూడా వేశారు. అక్కడ వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని మళ్లీ సైకి‌లపై వచ్చారు.

హైలైట్:

  • ఏపీ మంత్రి రామానాయుడు వ్యవసాయం
  • ట్రాక్టర్ సాయంతో దుక్కి దున్నిన మంత్రి
  • రొయ్యల చెరువులో మేత వేసి రామాానాయుడు
Nimmala Ramanaidu
నిమ్మల రామానాయుడు వ్యవసాయం(ఫోటోలు– Samayam Telugu)
ఏపీ మంత్రి రైతుగా మారారు.. తన సొంత పొలంలో వ్యవసాయం పనులు చేపట్టారు. ఆదివారం కావడంతో కాస్త తీరిక చేసుకుని ట్రాక్టర్ సాయంతో దుక్కి దున్నారు. రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సొంత ఊరిలో వ్యవసాయం పనుల్లో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో ఉదయాన్నే సైకిల్ తొక్కుకుంటూ పాలకొల్లు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అగర్తిపాలెనికి చేరుకున్నారు. ఆయన సైకిల్‌పై వెళుతూ దారి వెంట ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఆయన స్వయంగా సొంత రొయ్యల చెరువులో మేత వేసి.. రొయ్యల పెంపకం, ఎదుగుదలను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లి తన పొలంలో ట్రాక్టర్‌తో దుక్కిదున్నారు.

ఆదివారం సెలవు రోజు కావడంతో మంత్రి నిమ్మల రామానాయుడికి కొంత సమయం దొరికింది. అందుకే ఆయన తనకు ఇష్టమైన వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. తన సొంత వ్యవసాయ పనుల్లో అందరితో కలిసి పనిచేయడం ఎంతో సంతృప్తిగా ఉందని చెబుతున్నారు. అలాగే ఆదివారం షెడ్యూల్ ప్రకారం గోదావరి డెల్టాకు సాగు నీరు విడుదల చేశామన్నారు. రైతులందరూ ముందస్తుగా వరి నాట్లు వేసేందుకు సిద్ధం కావాలని.. ఎల్‌నినో కారణంగా సాగు నీటిని సక్రమంగా వినియోగించుకుంటూ జల సంరక్షణ చేపట్టాలని కోరారు మంత్రి నిమ్మల రామానాయుడు. పొలంలో వ్యవసాయం పనుల పూర్తి చేసుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు తిరుగు ప్రయాణంలో కూడా సైకిల్‌‌పై ఇంటికి వెళ్లారు. నిమ్మల రామానాయుడికి వ్యవసాయం చేయడం ఇష్టం.. ఆయన తన సొంత పొలాన్ని ప్రతి ఏటా సాగు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా బిజీగా ఉన్నా సరే సమయం దొరికినప్పుడల్లా సొంత ఊరికి వెళ్లి వ్యవసాయ పనులు చేస్తుంటారు.

‘ఆదివారం తెల్లవారుజామున పాలకొల్లు నుంచి 7 కిలోమీటర్లు సైకిల్ పై సొంతూరు అగర్తిపాలెం వెళ్లి సొంత రొయ్యల చెరువులో మేత వేసి రొయ్య ఎదుగుదలను పరిశీలించడం జరిగింది. వరి పొలంలో కార్మికులతో కలిసి ట్రాక్టర్ తో దుక్కి దున్నడం జరిగింది. అనంతరం గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేసి అభివృద్ధి చేస్తున్న హిందూ స్మశాన వాటిక పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం తిరిగి 7 కిలోమీటర్లు సైకిల్ పై పాలకొల్లు రావడం జరిగింది. ఈ రోడ్ లో జలజీవన్ మిషన్ మంచినీటి పైపులైన్ రోడ్డు వెంబడి నుంచి వెళుతుండడం చూసి భవిష్యత్తులో పైపులైను మరమ్మత్తు పనులు చేపట్టాల్సి వస్తే మంజూరైన సిమెంట్ రోడ్ కు ఇబ్బంది లేకుండా పైప్ లైన్ నడిచేలా చూడాలని ఆర్ అండ్ బి ఇంజనీర్లను ఆదేశించడం జరిగింది. ఆదివారం సెలవు రోజున కొద్దిపాటి సమయం దొరకడంతో సొంత వ్యవసాయ పనుల్లో పాల్గొనడం ఎంతో సంతృప్తి ఆనందం కలిగింది’ అంటూ మంత్రి రామానాయుడు ట్వీట్ చేశారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.

తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి