సాధారణంగా షష్టిపూర్తి వేడుకలంటే కల్యాణ మండపాల్లో, బంధుమిత్రుల కోలాహలం మధ్య జరుపుకోవడం చూస్తుంటాం. కానీ, అందుకు పూర్తి భిన్నంగా నిరుపేద శ్రమజీవుల మధ్య, తాము నిత్యం పనిచేసే ఉపాధి హామీ క్షేత్రంలోనే షష్టిపూర్తి వేడుకలు జరుపుకుని ఆదర్శంగా నిలిచారు దంపతులు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (MGNREGS) పని స్థలంలో ఆకుతోట జయమ్మ, సోమయ్య దంపతుల షష్టిపూర్తి (60 ఏళ్లు నిండిన సందర్భంగా జరుపుకునే వేడుక) ఘనంగా జరిగింది.. తోటి కూలీలే అతిథులు.. పారలే అక్షింతలు అయ్యాయి..

