Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కొత్త కుర్రాడి మీద కోటి బడ్జెట్ అవసరమా అన్నారు.. కట్ చేస్తే.. 2000లో బాక్సాఫీస్ షేక్.. 26 ఏళ్లుగా ట్రెండింగ్ మూవీ..

12 June 2026

దిమ్మ తిరిగే షాక్! బంగారంతో పోటీ పడుతున్న వెండి.. నేటి ధరలు ఇవే | Gold Price Skyrockets To Rs 152200 In Hyderabad; Silver Rates Jump By Rs 9000 Per KG In A Single Day

12 June 2026

సూర్య చేయాలనుకున్న కథతో రజనీ సినిమా

12 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»South Coast Railway Zone Operations Started,ఏపీ ప్రజల కల నెరవేరిన వేళ.. దక్షిణ కోస్తా జోన్‌ ప్రారంభం, 130 ఏళ్ల చరిత్రున్న వాల్తేరు డివిజన్‌ కనుమరుగు – south coast railway zone operations started in visakhapatnam today
ఆంధ్రప్రదేశ్

South Coast Railway Zone Operations Started,ఏపీ ప్రజల కల నెరవేరిన వేళ.. దక్షిణ కోస్తా జోన్‌ ప్రారంభం, 130 ఏళ్ల చరిత్రున్న వాల్తేరు డివిజన్‌ కనుమరుగు – south coast railway zone operations started in visakhapatnam today

.By .1 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
South Coast Railway Zone Operations Started,ఏపీ ప్రజల కల నెరవేరిన వేళ.. దక్షిణ కోస్తా జోన్‌ ప్రారంభం, 130 ఏళ్ల చరిత్రున్న వాల్తేరు డివిజన్‌ కనుమరుగు – south coast railway zone operations started in visakhapatnam today
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్ల కల నెరవేరింది.. ఎట్టకేలకు దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రారంభమైంది. విశాఖపట్నం కేంద్రంగా ఇవాళ దక్షిణ కోస్తా రైల్వేజోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రైల్వే జోన్ తాత్కాలిక కార్యాలయాన్ని నగరంలోని వీఎంఆర్‌డీఏ డెక్‌ భవనంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడుతో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖ డివిజనల్‌ రైల్వే అధికారులతో.. హెచ్‌వోడీలతో జీఎం సందీప్‌ మాథుర్‌ సమావేశం నిర్వహించారు. మే 5న రైల్వే శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేయగా.. నేటి నుంచి విశాఖ కేంద్రం రైల్వేజోన్‌కు సంబంధించిన మెకానికల్, టెలికమ్యూనికేషన్, సివిల్, ప్రధాన పరిపాలన వ్యవహారాలన్నీ నిర్వహించనున్నారు. ఇప్పటికే జీఎంను, సీపీఆర్వోను నియమించారు.

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌‌లోకి విశాఖపట్నం, గుంతకల్లు, గుంటూరు, విజయవాడ నాలుగు డివిజన్ల కలిపి పని చేస్తోంది. అంతేకాదు ఏకంగా 130 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ కనుమరుగైంది. విశాఖపట్నం కేంద్రం రైల్వేజోన్ ఏర్పాటు కానుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి.. దక్షిణ మధ్య రైల్వేలోని గుంతకల్‌, గుంటూరు, విజయవాడ డివిజన్లు, తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో ఉన్న వాల్తేరు డివిజన్‌లో విడగొట్టిప భాగాన్ని కలిపి ఏర్పాటు చేశారు. వాస్తవానికి 2019లోనే రైల్వేజోన్ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది.. 2020-2021 బడ్జెట్‌లో కొత్త రైల్వేజోన్ ఆఫీస్, ఇతర భవనాల కోసం రూ.170 కోట్లు కేటాయించారు.. కానీ గత ఐదేళ్లు పనులు ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు అప్పగించడంతో జోన్ పనులు ఊపందుకున్నాయి. విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ శంకుస్థాపనకు ఏప్రిల్‌ 28న వచ్చి రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ రైల్వేజోన్‌పై కీలక ప్రకటన చేశారు.. మే 5న గెజిట్ నోటిఫికేషన్, ఇవాళ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

‘జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి. దశాబ్దాల మన కల నెరవేరుతోంది. నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తుంది. కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక వృద్ధికి బాటలు వేస్తుంది. మన రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు ఇది ఒక కీలక మైలురాయి. ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారికి రాష్ట్ర ప్రజల తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.

రైల్వే జోన్ కార్యకలపాలు ప్రారంభమైనా.. ఉద్యోగులు పాటించాల్సిన నియమ నిబంధనలపై ఇంకా కసరత్తు జరుగుతోంది. ఆయా జోన్లకు సంబంధించి రైల్వే ఉద్యోగులకు ప్రత్యేకంగా నియమావళి ఉంటుంది.. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభమైనా.. నిబంధనలపై క్లారిటీ లేదు. ఉద్యోగులు ఎలాంటి మార్గదర్శకాలు అనుసరించాలో తెలియక కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. అయితే మే 30న దక్షిణ కోస్తా జోన్ ఆపరేటింగ్ వింగ్ కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖపట్నం డివిజన్ ప్రస్తుతానికి తూర్పు కోస్తా జోన్‌ సాధారణ నియమాలు పాటించాలని సూచించారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు దక్షిణమధ్య రైల్వే జోన్‌ నియమాలు పాటించాలన్నారు. కొత్త మార్గదర్శకాలు వచ్చే వరకు పాతవాటినే కొనసాగించానల్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.

తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

రాజమహేంద్రవరం నుంచి పైలట్లకు రెక్కలు.. రాష్ట్ర తొలి ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి శ్రీకారం!

12 June 2026

Srikakulam Harini Murder Case Updates,శ్రీకాకుళం పురువు హత్య.. చావును ముందే ఊహించిన హరిణి?, పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు – police reveals key points in srikakulam harini murder case

12 June 2026

Raghurama Letter To Dgp On Sc Atrocity Cases,ఏపీలో వారి ఎస్సీ హోదాను ధ్రువీకరించాలి.. డిప్యూటీ స్పీకర్ రఘురామ లేఖ – ap deputy speaker raghu rama krishna raju wrote a letter to dgp on filing cases under sc st atrocities act

12 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

కొత్త కుర్రాడి మీద కోటి బడ్జెట్ అవసరమా అన్నారు.. కట్ చేస్తే.. 2000లో బాక్సాఫీస్ షేక్.. 26 ఏళ్లుగా ట్రెండింగ్ మూవీ..

12 June 2026

ప్రముఖ దర్శకుడు కే. విజయ భాస్కర్, తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే నువ్వే కావాలి వంటి విజయవంతమైన చిత్రం తర్వాత…

దిమ్మ తిరిగే షాక్! బంగారంతో పోటీ పడుతున్న వెండి.. నేటి ధరలు ఇవే | Gold Price Skyrockets To Rs 152200 In Hyderabad; Silver Rates Jump By Rs 9000 Per KG In A Single Day

12 June 2026

సూర్య చేయాలనుకున్న కథతో రజనీ సినిమా

12 June 2026

బల్లూకం బీభత్సం భయం.. చీకటి పడితే చాలు, వణుకుతున్న గ్రామం..!

12 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

కొత్త కుర్రాడి మీద కోటి బడ్జెట్ అవసరమా అన్నారు.. కట్ చేస్తే.. 2000లో బాక్సాఫీస్ షేక్.. 26 ఏళ్లుగా ట్రెండింగ్ మూవీ..

12 June 2026

దిమ్మ తిరిగే షాక్! బంగారంతో పోటీ పడుతున్న వెండి.. నేటి ధరలు ఇవే | Gold Price Skyrockets To Rs 152200 In Hyderabad; Silver Rates Jump By Rs 9000 Per KG In A Single Day

12 June 2026

సూర్య చేయాలనుకున్న కథతో రజనీ సినిమా

12 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025566

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025523

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.