Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

10 June 2026

స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?

10 June 2026

Andhra Vankaya Vepudu: 15 నిమిషాల్లో నోరూరించే ఆంధ్రా స్టైల్ ‘వంకాయ వేపుడు’.. అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్ ఇదీ!

10 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Nara Lokesh Airtrunk Vizag,ఏపీకి ఎయిర్ ట్రంక్..! మంత్రి నారా లోకేష్ ఆహ్వానం.. – nara lokesh invite airtrunk to establish its future india campus in visakhapatnam in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Nara Lokesh Airtrunk Vizag,ఏపీకి ఎయిర్ ట్రంక్..! మంత్రి నారా లోకేష్ ఆహ్వానం.. – nara lokesh invite airtrunk to establish its future india campus in visakhapatnam in andhra pradesh

.By .1 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nara Lokesh Airtrunk Vizag,ఏపీకి ఎయిర్ ట్రంక్..! మంత్రి నారా లోకేష్ ఆహ్వానం.. – nara lokesh invite airtrunk to establish its future india campus in visakhapatnam in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ రానుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. సోమవారం రోజున ముంబయిలో పర్యటించిన మంత్రి నారా లోకేష్.. ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్ ట్రంక్ నూతన క్యాంపస్ విశాఖలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఉన్న అవకాశాలను వివరించారు. మరోవైపు గతేడాది అక్టోబర్ నెలలోనూ రాబిన్ ఖుదాతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. తాజాగా రెండోసారి భేటీ అయ్యి.. విశాఖలో క్యాంపస్ ఏర్పాటు గురించి చర్చించారు.

హైలైట్:

  • ఏపీకి ఎయిర్ ట్రంక్ సంస్థ!
  • ముంబయిలో సీఈవో రాబిన్ ఖుదాతో లోకేష్ భేటీ
  • విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు ఆహ్వానం
lokesh
ఎయిర్ ట్రంక్ సీఈవోతో నారా లోకేష్ భేటీ(ఫోటోలు– Samayam Telugu)
సాగర తీరం విశాఖపట్నానికి ప్రముఖ సంస్థలను తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఈ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి ఐటీ సంస్థలు విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. తాజాగా ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోంది. విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్.. ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాను కోరారు. సోమవారం రోజున ముంబయిలో పర్యటించారు నారా లోకేష్. ఈ సందర్భంగా ఎయిర్ ట్రంక్ సీఈవోతోభేటీ అయ్యారు. విశాఖపట్నం డేటా సెంటర్ల ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూలమైనదని వివరించారు. డేటా సెంటర్ హబ్‌గా విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎయిర్ ట్రంక్ సీఈవోకు నారా లోకేష్ వివరించారు.

విశాఖపట్నంలో ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, అదానీ కనెక్స్ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. సాగరతీరం విశాఖపట్నంలో 6 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలనేదే తమ ప్రభుత్వం లక్ష్యమని.. దీనికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు నారా లోకేష్ తెలిపారు. ఈ క్రమంలోనే ఎయిర్ ట్రంక్ సంస్థ కొత్త క్యాంపస్ విశాఖలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోనే మరే ఇతర ప్రాంతానికి లేని విధంగా విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు, అనుసంధానం ఉందని గుర్తు చేశారు. డేటా సెంటర్ల కోసం విద్యుత్ కావాల్సి వస్తుందని.. ఇందుకోస రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్లు కూడా ఏపీలో సిద్ధమవుతున్నాయని నారా లోకేష్ వివరించారు.

మరోవైపు గతేడాది అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాలో పర్యటించారు నారా లోకేష్. ఈ సందర్బంగా తొలిసారిగా ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో భేటీ అయ్యారు. అనంతరం ఎయిర్ ట్రంక్ ప్రతినిధులతో ఏపీ బృందం పలుసార్లు చర్చలు జరిపింది. ఈ సందర్భంగా భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత ఏపీలో క్యాంపస్ ఏర్పాటుపై ఆలోచన చేస్తామని ఈ సందర్భంగా ఎయిర్ ట్రంక్ ప్రతినిధులు ఏపీ ఉన్నతాధికారులకు తెలియజేశారు.

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఎయిర్ ట్రంక్ భారత్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో.. విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేయాలంటూ నారా లోకేష్ సీఈవో రాబిన్ ఖుదాను కలిశారు. మరోవైపు ఎయిర్ ట్రంక్ సంస్థ ఆసియా పసిఫిక్, మధ్య ప్రాచ్య దేశాలలో కార్యకలాపాలు సాగిస్తున్న ఓ డేటా సెంటర్ కంపెనీ. ఇది క్లౌడ్, ఏఐ కంపెనీల కోసం హైపర్ స్కేల్ డేటా సౌకర్యాలను అందిస్తుంటుంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి