Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పాత కాలపు నాటి తోటకూర రుబ్బు తాళింపు.. పవర్ఫుల్ ఫుడ్ ఇది.. ఒక్కసారి ట్రై చేస్తే వదలరు!

6 June 2026

టీటీడీలో నూతన పథకం | Srivari Vaidya Seva Hits TTD Hospitals with Global Expert Access for Devotees World Class Medicare

6 June 2026

Vijayasai Reddy Praises Karnataka Cm Dk Shivakumar,కర్ణాటక సీఎం డీకే మంచి నిర్ణయం తీసుకున్నారు.. ఏపీ, తెలంగాణతో పాటుగా దేశమంతా అమలు చేయాలి: విజయసాయిరెడ్డి – former mp vijaya sai reddy praises karnataka cm dk shivakumar created a ministry of bangalore

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Rajya Sabha Elections 2026,ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఎవరా నలుగురు.. ‘ఆమె’కు అవకాశం ఇస్తారా? – election commission releases notification for rajya sabha elections in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Ap Rajya Sabha Elections 2026,ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఎవరా నలుగురు.. ‘ఆమె’కు అవకాశం ఇస్తారా? – election commission releases notification for rajya sabha elections in andhra pradesh

.By .1 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Rajya Sabha Elections 2026,ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఎవరా నలుగురు.. ‘ఆమె’కు అవకాశం ఇస్తారా? – election commission releases notification for rajya sabha elections in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 18వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ చేపడతారు. మరోవైపు షెడ్యూల్ ప్రకటించటంతో ఇవాళ్టి నుంచే రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలుకు జూన్ 8వ తేదీ వరకూ గడువు ఉండగా.. జూన్ 11వ తేదీ వరకూ ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. మరోవైపు ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. పెద్దలసభకు వెళ్లే ఆ నలుగురు ఎవరా అనే దానిపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

హైలైట్:

  • ఏపీలో రాజ్యసభ ఎన్నికలు
  • నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ
  • జూన్ 18వ తేదీన ఎన్నికలు
AP Rajya Sabha Elections 2026
ఏపీలో రాజ్యసభ ఎన్నికలు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లోని రాజ్యసభ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ సహా పది రాష్ట్రాల్లోని రాజ్యసభ సీట్లకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్‌ 18న ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ గడువు ఉంది జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. జూన్ 11వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. జూన్ 18న ఎన్నికల జరగనుండగా.. సాయంత్రం ఐదు గంటల నుంచి లెక్కింపు ఉంటుంది. జూన్ 20వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

మరోవైపు ఏపీలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టీడీపీలో రాజ్యసభ సీటును ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. సీటు కోసం ఇప్పటికే పలువురు నేతలు లాబీయింగ్ మొదలుపెట్టారు. రాజ్యసభ సీటు కోసం పలువురు సీనియర్ నేతలు, సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలు అందించిన వారు పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ ఉన్న నేపథ్యంలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్దల సభకు వెళ్లేందుకు పలువురు నేతలు ఇప్పటికే లాబీయింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

ఆమెకు అవకాశం ఉంటుందా?

మరోవైపు ఇటీవల జరిగిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల నుంచి మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వే్ చేస్తామని నారా లోకేష్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం ఈ రాజ్యసభ ఎన్నికల నుంచే అమలు చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహిళకు రాజ్యసభ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నుంచి అని నారా లోకేష్ ప్రకటించినప్పటికీ.. తక్షణమే అమలు చేస్తే మహిళా ఓటర్ల మద్దతును పదిలం చేసుకోవచ్చని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు నాలుగు రాజ్యసభ సీట్లలో ఈసారికి బీజేపీకి అవకాశం ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈసారికి రాజ్యసభ సీటు అడగవద్దని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానాన్ని కోరినట్లు పార్టీ వర్గాలు చెప్తు్న్నాయి. గతంలో రెండు రాజ్యసభ స్థానాలను బీజేపీకి ఇచ్చామని.. ప్రస్తుతం టీడీపీ నుంచి ఎక్కువ మంది ఆశిస్తున్న నేపథ్యంలో ఈసారికి సీటు అడగొద్దని కోరినట్లు తెలిసింది. అలాగే కూటమిలోని మరో భాగస్వామ్య పార్టీ జనసేనకు ఒక సీటు ఇవ్వాల్సిన సంగతిని వివరించినట్లు సమాచారం. దీనిపై బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. నాలుగు సీట్లలో మూడు టీడీపీ, ఒకటి జనసేన తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

రాజ్యసభ రేసులో పలువురు సీనియర్ నేతలు..

మరోవైపు రాజ్యసభ స్థానం కోసం టీడీపీలోని పలువురు సీనియర్ నేతలు పోటీపడుతున్నారు. వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, కంభంపాటి రామ్మోహన్ రావు, భాష్యం రామకృష్ణ వంటి నేతలు పోటీ పడుతున్నారు. అలాగే సిట్టింగ్ ఎంపీ సానా సతీష్ కూడా మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. వీరితో పాటుగా చింతకాయల విజయ్, లోకేష్ సన్నిహితుడు రాజేష్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇక రాయలసీమ నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఈ ప్రాంతం నుంచి వైసీపీకి రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముగ్గురు ఎంపీలు ఉండటంతో.. టీడీపీ నుంచి కూడా ఈ సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

మొత్తంగా రాజ్యసభ స్థానం కోసం పలువురు సీనియర్లు, జూనియర్లు పోటీపడుతున్న తరుణంలో.. నారా లోకేష్ ఆశావహుల జాబితాను సిద్ధం చేస్తారని, వీటిలో నుంచి తగిన పేర్లను చంద్రబాబు ఎంపిక చేస్తారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరా నలుగురు అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి