
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆదివారం హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీనికంతటికీ వైసీపీ నుంచి ఓ నేత బీజేపీలోకి చేరేందుకు సిద్ధపడటమే కారణమని తెలిసింది. కృష్ణాపురం జమీర్ అనే వ్యక్తి వైసీపీ నుంచి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇతను బీజేపీలో చేరడాన్ని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ధర్మవరంలో ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు చించివేశాయి. ఇదే రెండు వర్గాల మధ్య దాడులకు కారణమైనట్లు తెలిసింది.
Source link
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
.

