Andhra Pradesh Dwcra Women Solar: ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం మరో వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. కేంద్ర పథకమైన పీఎం సూర్యఘర్ యోజనను డ్వాక్రా మహిళలకు కూడా అమలు చేస్తోంది. ఈ మేరకు రాయితీతో డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్టాప్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ మేరకు సామర్థ్యాన్ని బట్టి రాయితీని అందిస్తోంది.
హైలైట్:
- ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం
- పీఎం సూర్యఘర్ యోజన పథకాన్ని అమలు చేస్తున్నారు
- రాయితీపై ఇళ్లపై సోలార్ రూఫ్టాప్లను అమరుస్తున్నారు

కేంద్రం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ యోజన గృహ వినియోగదారులకు వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకంలో భాగంగా మూడు రకాల కెపాసిటీతో సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసేందుకు రాయితీ అందిస్తున్నారు. ఒక కిలోవాట్ సోలార్ రూఫ్ టాప్ వ్యయం రూ.70 వేలు ఉంటే.. అందులో రూ.30 వేల రాయితీ లభిస్తుంది. రెండు కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ రూ.1.40 లక్షలు కాగా రాయితీ రూ.60 వేలు ఉంటుంది. అదే మూడు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్టాప్ ఏర్పాటు కోసం వ్యయం రూ.1.95 లక్షలు కాగా.. రాయితీ రూ.78 వేలు వస్తుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు వారి ఇంటి విద్యుత్ వినియోగాన్ని బట్టి రూఫ్టాప్ సామర్థ్యాన్ని నిర్ణయించుకోవచ్చు.
పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద.. లబ్ధిదారు వాటా 10 శాతం పోనూ, మిగతా మొత్తాన్ని 7% వడ్డీపై బ్యాంకుల ద్వారా రుణం ఇస్తారు. ఈ రుణాన్ని అందించే బాధ్యత సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ) అధికారులుది. ఒకవేళ లబ్ధిదారులు 10 శాతం వాటా కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే.. ఆ మొత్తాన్ని బ్యాంకు, స్త్రీనిధి, పొదుపు మొత్తం నుంచి అందిస్తారు. డ్వాక్రా మహిళలకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరతున్నారు.


