Kakinada Swallows Mobile: కాకినాడలో కీప్యాడ్ మొబైల్ మింగిన మహిళా మానసిక రోగి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రాజమహేంద్రవరం బొమ్మూరుకు చెందిన మహిళ మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెను రాజమహేంద్రవరం జీజీహెచ్లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శబంధువు కీప్యాడ్ మొబైల్ మింగేసింది.. వెంటనే గమనించి డాక్టర్లు చెప్పగా చికిత్స చేసి బయటకు తీశారు. ఆరోజు రాత్రికి ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యానికి కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న మహిళ చనిపోయింది.
హైలైట్:
- కాకినాడ జీజీహెచ్లో ఘటన
- శనివారం మొబైల్ మింగేసింది
- చికిత్సపొందుతూ చనిపోయింది

మానసిక స్థితి సరిలేక యువకుడి ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిలేని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జీవీఆర్ కొండపై నివాసం ఉంటున్న మర్రి రంగప్రసాద్బాబుకు ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు. ఆయన గతంలో వ్యవసాయ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఉద్యోగం వదిలేసి ఖాళీగా ఉంటున్నారు.
ప్రసాద్ పెద్ద కుమారుడు విజయవాడలో రోజువారి కూలీగా పనిచేస్తుండగా.. రెండో కుమారుడు రాజా రంజిత్ కుమార్ ఖాళీగా ఇంటి దగ్గరే ఉంటున్నాడు.
రంజిత్ కుమార్ గంజాయి, మద్యానికి బానిసగా మారడంతో.. కొంతకాలానికి మానసిక స్థితి సరిగా లేదు. గతంలో తాను చనిపోతానని ఓసారి ట్రాన్స్ఫార్మర్ ఎక్కాడు, అలాగే మరోసారి కత్తితో మెడపై కోసుకున్నాడు. అతడికి కుటుంబసభ్యులు వైద్యం అందించినా కోలుకోలేదు. ఈ క్రమంలో ఈ నెల 22న ప్రసాద్ భార్యతో కలిసి విజయవాడలో పెద్ద కొడుకు దగ్గరకు వెళ్లారు. అయితే రంజిత్ కుమార్ రాజమహేంద్రవరంలోని ఇంటి పక్కన ఉన్న చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. మానసిక సమస్యతోనే ఆయన ప్రాణాలు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


