Posani Krishna Murali 14 Days Remand,పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్, జైలుకు తరలింపు – 14 days remand for actor posani krishna murali
Posani Krishna Murali Remand 14 Days: సినీనటుడు పోసాని కృష్ణ మురళికి షాక్ తప్పలేదు. రైల్వే కోడూరు కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో రాత్రి 9.30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు నడిచాయి. అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి ఆయన్ను పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.
హైలైట్:
పోసాని కృష్ణమురళికి 14 రోజులు రిమాండ్
కడప సెంట్రల్ జైలుకు తరలించనున్నారు
ఏడు గంటల పాటూ కోర్టులో వాదనలు
Samayam Teluguపోసాని కృష్ణమురళికి రిమాండ్సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఎదురుదెబ్బ తగిలింది.. ఆయనకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆయన్ను రైల్వే కోడూరు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్లో పోసానిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పోలీసులు ఆయన్ను ప్రశ్నించారు.. ఆ తరర్వాత గురువారం రాత్రి 9.30 గంటలకు పోసానిని రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచారు. అయితే రాత్రి 10 గంటల నుంచి కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి.. ఉదయం 5 గంటల వరకు కొనసాగాయి. దాదాపు 7 గంటల పాటూ ఈ వాదనలు కొనసాగగా.. కోర్టు పోసానికి 14 రోజులు రిమాండ్ విధించింది.పోసాని కృష్ణమురళిపై బీఎన్ఎస్ 111 యాక్ట్ నమోదు చేయడం పై సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పోసాని కృష్ణమురళి కేసు ఆర్గనైజ్డ్ క్రైం కాదన్న పొన్నవోలు.. పోసాని కృష్ణమురళి కి రిమాండ్ విధించవద్దని వాదనలు వినిపించారు. పోసానికి రిమాండ్ విధించాలని పోలీసుల తరఫున లాయర్ కోరారు. అయితే పోసానిని ప్రశ్నించేందుకు పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. అంతకముందు పోసాని కృష్ణమురళిని పోలీసులు ప్రశ్నించారు.. గతంలో మాట్లాడిన వీడియోలను ఆయనకు చూపించి ఆరా తీశారు. అయితే తాను అసభ్య దూషణలు చేసింది నిజమేనని.. ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాని పోసాని చెప్పినట్లు తెలుస్తోంది. తాను చేసేది, చెప్పేది ఏమీ లేదు అన్నారట.
పోసాని కృష్ణమురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నేత జోగినేని మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఎన్ఎస్లోని 196, 353(2), 111 రెడ్విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. ఓబులవారిపల్లె మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పోసానిపై పోలీసులు కేసులు నమోద చేశారు.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి