అసెంబ్లీలో నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఏపీలో కూటమి(టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వచ్చాక తొలిసారి ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనల అంచనా వ్యయం సుమారు 3.24 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర పునఃనిర్మాణం దిశగా అడుగులు వేయించడం, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఇది కీలక బడ్జెట్ కాబోతుందని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. 2047నాటికి 15 శాతం GSDP వృద్ధే లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉంది.
అభివృద్ధి తో పాటు సంక్షేమ పథకాల అమలుకు కూడా ఈ బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ బడ్జెట్పై రాష్ట్ర ప్రజలు కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇక శాసనమండలిలో కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో సమర్పించనున్నారు మంత్రి అచ్చెన్నాయుడు, మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఇక బడ్జెట్ సమావేశాల కంటే ముందు శుక్రవారం ఉదయం 9 రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. శాసనసభలోని ముఖ్యమంత్రి ఛాంబర్ లో జరగనున్న కేబినెట్ సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

