బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా వివాహం గురించి పలు రకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి . ఆమె తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను వివాహం చేసుకోబోతోందని తెలుసుకున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారిద్దరూ వేర్వేరు మతాలకు చెందినవారు. అంతేకాదు ఈ వివాహానికి సోనాక్షి సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హా అంగీకరించలేదని కూడా ప్రచారం. కానీ శతృఘ్న సిన్హా కూడా వివాహానికి హాజరు కావడంతో అన్ని ఊహాగానాలకు తెరపడింది. ఇప్పుడు, ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సోనాక్షి సిన్హా తన మ్యారేజ్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. సోనాక్షి సిన్హా హిందూ మతానికి చెందినది. ఆమె భర్త జహీర్ ఇక్బాల్ ఒక ముస్లిం. ఈ క్రమంలోనే సోనాక్షి సిన్హా వివాహం తర్వాత ఇస్లాం మతంలోకి మారతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను ఖండించింది సోనాక్షి. ‘ మా ఇద్దరి మధ్య మతం మార్పిడి ప్రశ్న ఎప్పుడూ రాలేదు. మేం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. అంతే చాలు. ‘మేము మతాన్ని మాత్రమే చూడము.’ ప్రేమించుకున్న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు వాళ్ళ మతాన్ని నా మీద రుద్దలేదు. అలాగే, నేను నా మతాన్ని వారిపై రుద్దలేదు. మేము మతం గురించి అస్సలు చర్చించం. మేమిద్దరం దాని గురించి అసలు మాట్లాడుకోం’ అని సోనాక్షి సిన్హా చెప్పుకొచ్చింది.
“మతం గురించి మాట్లాడటానికి బదులుగా, మేము ఒకరి సంస్కృతిని గౌరవిస్తాం. అర్థం చేసుకుంటాము.” వారు తమ ఇంట్లో కొన్ని సంప్రదాయాలను పాటిస్తారు. నాకు నా స్వంత సంప్రదాయాలు ఉన్నాయి. నేను వారి సంప్రదాయాన్ని గౌరవిస్తాను. వాళ్ళు నా సంస్కృతిని గౌరవిస్తారు. ఇది ఎల్లకాలం కొనసాగుతుంది’ అని సోనాక్షి సిన్హా తెలిపింది. సోనాక్షి సిన్హా తన ప్రేమ గురించి తన తండ్రి శత్రుఘ్న సిన్హాకు మొదటిసారి చెప్పినప్పుడు ఆయన ఇష్టం లేదన్నట్లు తెలిసింది. అయితే తన కూతురి సంతోషం ముఖ్యం కాబట్టి ఈ పెళ్లికి అంగీకరించానని సోనాక్షి ఇప్పుడు తెలిపింది.
ఇవి కూడా చదవండి
భర్తతో సోనాక్షి సిన్హా..
కాగా గతేడాది జూన్ 23న సోనాక్షి, జహీర్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కాకముందు ఇద్దరూ ఆరేళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. కాగా పెళ్లి తర్వాత సోనాక్షి, జహీర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘తు హై మేరీ కిరణ్’. దర్శకుడు కరణ్ రావల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

