Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Aadhaar Card: ఆధార్ కార్డు వాడుతున్నవారికి పండుగ.. ఉచితంగా ఆ సేవలు.. ప్రతీఒక్కరికీ అవకాశం..

18 May 2026

Mental Krishna: ‘నేను నైటీ వేసుకోలేను’.. పోసాని ‘మెంటల్ కృష్ణ’ మూవీని రిజెక్ట్ చేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా?

18 May 2026

Jayam Ravi: కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా జయం రవి రెండో బ్రేకప్

18 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Matsyakara Bharosa Scheme Andhra Pradesh Budget,ఏపీలో మరో పథకం అమలు.. ఒక్కొక్కరికి రూ.20వేలు, ముందుగానే డబ్బులు విడుదల – andhra pradesh government allocates funds for matsyakara bharosa scheme in ap budget 2025
ఆంధ్రప్రదేశ్

Matsyakara Bharosa Scheme Andhra Pradesh Budget,ఏపీలో మరో పథకం అమలు.. ఒక్కొక్కరికి రూ.20వేలు, ముందుగానే డబ్బులు విడుదల – andhra pradesh government allocates funds for matsyakara bharosa scheme in ap budget 2025

.By .28 February 2025No Comments34 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Matsyakara Bharosa Scheme Andhra Pradesh Budget,ఏపీలో మరో పథకం అమలు.. ఒక్కొక్కరికి రూ.20వేలు, ముందుగానే డబ్బులు విడుదల – andhra pradesh government allocates funds for matsyakara bharosa scheme in ap budget 2025
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Budget Matsyakara Bharosa Scheme Allocations: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్​లో సంక్షేమ పథఖాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు పెద్ద పీట వేశారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20 వేలు ఇచ్చేలా కేటాయింపులు చేశారు. అంతేకాదు మత్స్యకారులకు కూడా తీపికబురు చెప్పారు. మత్స్యకారులకు సముద్ర చేపల వేట నిషేధ కాల భృతిని ఒక్కొక్కరికి రూ.20వేల చొప్పున అందిస్తామన్నారు.

హైలైట్:

  • ఏపీ బడ్జెట్‌లో మరో పథకానికి నిధులు
  • ఒక్కొక్కరికి రూ.20వేలు ఇస్తారు
  • ముందుగానే నిధులు విడుదల
Samayam Teluguఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మత్స్యకార భరోసా
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మత్స్యకార భరోసా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టారు. రైతులు, మత్స్యకారులపై వరాల జల్లు కురిపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. మత్స్యకారులకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.20వేలు భరోసాను అందిస్తామన్నారు. స్వర్ణాంధ్ర-2047లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి మత్స్య, ఆక్వా రంగాన్ని ఒక గ్రోత్ ఇంజన్‌గా గుర్తించామన్నారు. పులికాట్‌ సరస్సులోని 20వేల మత్స్యకారుల కుటుంబాల ప్రయోజనం కోసం, తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు గ్రామం దగ్గర సముద్ర ముఖద్వారం తెరవడం కోసం
రూ. 97.09 కోట్లతో పనులను చేపట్టనున్నామన్నారు. అలాగే అర్హులైన సముద్ర మత్స్యకారులందరికీ ప్రతి కుటుంబానికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు సముద్ర చేపల వేట నిషేధ కాల భృతిని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మొత్తం 1,22,968 మంది మత్స్యకారులకి కుటుంబానికి రూ.20వేలు చొప్పున రూ.245.936 కోట్లను ఈ ఏడాది వేట నిషేధ కాలానికి ముందే విడుదల చేస్తున్నామని ప్రకటించారు. PMMSY పథకం కింద 15 తీరప్రాంత మత్స్యకారుల గ్రామాలను వాతావరణ మార్పుని తట్టుకుని సుస్థిర అభివృద్ధి గ్రామాలుగా తీర్చిదిద్దడానికి రూ.30 కోట్లతో ప్రతిపాదించామన్నారు. డీజిల్‌ ఆయిల్‌ సబ్సిడీపై 2024-25సంవత్సరంలో రూ.50 కోట్లు ఖర్చు చేయటం ద్వారా 28,058 యాంత్రిక, మర బోట్‌లకు ప్రయోజనం దక్కిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో బకాయిలు రూ.9.90 కోట్లు కూడా చెల్లించామన్నారు. ఈ పథకం కోసం 2025-26 సంవత్సరంలో రూ. 50 కోట్లు ప్రతిపాదించామన్నారు.

గత ప్రభుత్వ హయాంలో 63 మంది మత్స్యకారులు చేపల వేటలో ప్రమాదవశాత్తు చనిపోతే.. వారి కుటుంబాలకు బకాయి పడిన రూ.3.15 కోట్లు ఎక్స్‌గ్రేషియా ఈ ప్రభుత్వం చెల్లించిందన్నారు. 2025-26కు రూ.8 కోట్లు ప్రతిపాదించామన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆక్వాకల్చర్‌ రైతులకు వారి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి రూ.1.50 పైసలు /యూనిట్‌ చొప్పున విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఆక్వా & నాన్‌ ఆక్వాజోన్‌లలో అర్హత కలిగిన 68,134 ఆక్వా సర్వీప్‌ కనెక్షన్లకు ఈ సదుపాయం విస్తరించడానికి చర్యలు చేపట్టామన్నారు. PMMSY పథకం కింద 2025-26లో మొత్తం రూ. 417 కోట్లు ప్రతిపాదించామన్నారు. 2025-26 సంవత్సరానికి మత్స్యరంగం అభివృద్ధికి రూ. 510. 189 కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు.

‘ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించాము. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాము. వికసిత్‌ భారత్‌ 2047కు అనుసంధానంగా ఏపీని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నాము. 2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము’ అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra Pradesh: మోసగాళ్లకే మోసగాళ్లు.. వీళ్ల స్కెచ్ మామూలుగా లేదుగా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

18 May 2026

సైకిల్, ఈవీలపై కలెక్టర్లు.. బస్సులో జాయింట్‌ కలెక్టర్‌.. శెభాష్!

18 May 2026

Chandrababu Balineni Srinivasa Reddy Meeting,ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. చంద్రబాబుతో బాలినేని భేటీ.. – janasena leader balineni srinivasa reddy meets cm chandrababu naidu

18 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Aadhaar Card: ఆధార్ కార్డు వాడుతున్నవారికి పండుగ.. ఉచితంగా ఆ సేవలు.. ప్రతీఒక్కరికీ అవకాశం..

18 May 2026

ఆధార్ కార్డు అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీఒక్కరికీ అవసరమైన డాక్యుమెంట్. ఆధార్ లేనిది ఇప్పటి పరిస్థితుల్లో ఏ పని జరగదు.…

Mental Krishna: ‘నేను నైటీ వేసుకోలేను’.. పోసాని ‘మెంటల్ కృష్ణ’ మూవీని రిజెక్ట్ చేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా?

18 May 2026

Jayam Ravi: కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా జయం రవి రెండో బ్రేకప్

18 May 2026

పర్సెంటేజ్ పంచాయితీ కొలిక్కి వచ్చినట్లేనా

18 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Aadhaar Card: ఆధార్ కార్డు వాడుతున్నవారికి పండుగ.. ఉచితంగా ఆ సేవలు.. ప్రతీఒక్కరికీ అవకాశం..

18 May 2026

Mental Krishna: ‘నేను నైటీ వేసుకోలేను’.. పోసాని ‘మెంటల్ కృష్ణ’ మూవీని రిజెక్ట్ చేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా?

18 May 2026

Jayam Ravi: కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా జయం రవి రెండో బ్రేకప్

18 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025518

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025477

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.