అందం ఉన్నా.. అదృష్టం లేని హీరోయిన్లలో అందరికంటే ముందొచ్చే పేరు రాశీ ఖన్నా. పాపం తెలుగులో మీడియం రేంజ్ హీరోలందరితోనూ జోడీ కట్టారీమే. అప్పుడప్పుడూ ఎన్టీఆర్ లాంటి స్టార్స్తోనూ నటించారు. కానీ లక్ మాత్రం లేదు. అందుకే చేసేదేం లేక.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు రాశీ.
అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన షాలిని పాండే.. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో మెప్పించింది లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. సింగిల్ సినిమా వండర్లా మారిపోయారీ బ్యూటీ. అప్పట్నుంచి ఇన్స్టా, ట్విట్టర్ అంటూ తేడా లేకుండా ఫోటోషూట్స్ చేస్తూనే ఉన్నారు.. కానీ ఈ రోజు వరకు షాలినికి కలిసొచ్చిందేమీ లేదు.
నన్ను దోచుకుందువటే సినిమాతో పరిచయమైన నభా నటేష్.. సాయి ధరమ్ తేజ్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతోనూ జోడీ కట్టారు. కానీ ఈమె కోరుకున్న బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం నిఖిల్తో స్వయంభులో నటిస్తున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో తరుచూ హాట్ ఫోటోషూట్స్ చేస్తూనే ఉంటారు. ఎంత గ్లామర్ షో చేసినా.. ఛాన్సులైతే రావట్లేదు.
పాపం హ్యాట్రిక్ బ్యూటీ కృతి శెట్టి కూడా సోషల్ మీడియాకే అంకితమైపోతున్నారు. గతేడాది శర్వానంద్తో నటించిన మనమే కూడా ఫ్లాపవ్వడంతో.. కృతి శెట్టి వైపు చూడటమే మానేసారు మేకర్స్.
దాంతో చూసేలా చేసుకోవడం కోసం గ్లామర్ షో భారీగా చేస్తున్నారీ బ్యూటీ. కానీ కాలమే కలిసిరావట్లేదు. మరి ఈ బ్యూటీస్ గ్లామర్ షో కెరీర్కు ఎప్పుడు ఉపయోగపడుతుందో చూడాలిక.






