Authored byతిరుమల బాబు | Samayam Telugu28 Feb 2025, 1:59 pm
తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. నటి హన్సిక తన భర్తతో కలిసి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అటు టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి శుక్రవారం వేకువ జామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు.