Andhra Pradesh Government House Construction Additional Help: ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఇంటి నిర్మాణాలకు ఇస్తున్న ఆర్దిక సహాయానికి అదనంగా బీసీలు, షెడ్యూల్ కులాల వారికి రూ.50వేలు, షెడ్యూల్డ్ తెగల వారికి అదనంగా రూ.75వేలు ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు తెలిపారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు అదనపు సాయం అందించనున్నారు. కేబినెట్లో కూడా ఆమోదం తెలిపారు.
హైలైట్:
- ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు
- వారందరికి అదనపు సాయం అందిస్తారు
- బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు సాయమిస్తారు

టీడీపీ హయాంలో బీసీలకు ప్రయోజనం కల్పించే లక్ష్యంతో ఆదరణ పథకంతో లక్షల మందికి పరికరాలు అందించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం అమలు చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ మేరకు రూ.1,000 కోట్ల నిధులు కేటాయించగా.. 1.50 లక్షల మందికి వివిధ ఉపకరణాలు అందజేయనున్నారు. పీఎం కుసుమ్ కింద వ్యవసాయ మోటార్లకు సోలార్ విద్యుత్కు సంబంధించి 3 లక్షల కనెక్షన్లకు అనుమతి వచ్చింది. అంతేకాదు 18 లక్షల మందికి లబ్ధి కల్పించేలా రూ.3 లక్షల వరకు రుణాలకు పావలా వడ్డీ, రూ.లక్ష రుణాలకు సున్నా వడ్డీ కింద రాష్ట్రంలో రైతులకు అందించనున్నారు.


