Janmabhoomi Express Two Days Cancelled: దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు. లింగంపల్లి – విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి లింగంపల్లి వచ్చే జన్మభూమి ఎక్స్ ప్రెస్ (12805) మార్చి 2న, లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే ఇదే రైలు (12806) మార్చి 3న రద్దు చేశారు. అలాగే సింహాద్రి ఎక్స్ప్రెస్ను కూడా రద్దు చేశారు.
హైలైట్:
- విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి బ్యాడ్న్యూస్
- రెండ్రోజుల పాటూ ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేశారు
- మార్చి 2, 3న ఈ రైలును రద్దు చేస్తున్నట్లు ప్రకటన

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వారాంతాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. చర్లపల్లి- కాకినాడ టౌన్ (07031) మార్చి 7, 13, 21, 28 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. కాకినాడ టౌన్- చర్లపల్లి(07032) మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతామన్నారు. చర్లపల్లి – నరసాపురం (07233) ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో.. నరసాపురం- చర్లపల్లి (07232) మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతామన్నారు. చర్లపల్లి-కాకినాడ టౌన్(07031) ప్రత్యేక రైలు రాత్రి 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. కాకినాడ టౌన్-చర్లపల్లి(07032) ప్రత్యేక రైలు సాయంత్రం 6.55 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
మార్చి 1 నుంచి 3 వరకు సింహాద్రి ఎక్స్ప్రెస్ను తాత్కాలికంగా రద్దు చేశారు. 1, 2 తేదీల్లో గుంటూరు-విశాఖపట్నం(17239), 2, 3 తేదీల్లో విశాఖపట్నం-గుంటూరు(17240) సింహాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉండవని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటనలో తెలిపారు.విజయవాడ డివిజన్ పరిధిలోని కడియం, ద్వారపూడి, అనపర్తి రైల్వేస్టేషన్ల మధ్య నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.


