టాలీవుడ్ హీరో నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ మాదాపూర్లో ఆయనకు చెందిన N కన్వెన్షన్ సెంటర్ను శనివారం ఉదయం హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కూల్చివేతలను ఆపాలంటూ నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అప్పటికే హైడ్రా అధికారులు N కన్వెన్షన్ సెంటర్ను పూర్తిగా నేలమట్టం చేశారు.

