హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.. మృతిచెందిన యువతిని సుష్మ (27)గా గుర్తించారు. వెంటనే ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ అడ్డగుట్టలో సుష్మ కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటోంది. బుధవారం హైటెక్ సిటీలోని తన ఆఫీస్ (DIEBOLD/NIXDORF) కి పని నిమిత్తం ఆమె వెళ్లింది. రాత్రి అయినా.. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆఫీస్ మేనేజర్కు తండ్రి అంజయ్య కాల్ చేశారు. అయితే.. రాత్రి 10.30 గంటలకే ఆమె ఆఫీస్ నుంచి బయల్దేరినట్లు మేనేజర్ వెల్లడించారు.. దీంతో కుమార్తె ఆచూకీ కోసం అంజయ్య పలువురిని సంప్రదించారు.. అయినా.. జాడ లభించకపోవడంతో.. కుమార్తె కనిపించడం లేదంటూ తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో అంజయ్య ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే.. దుర్గం చెరువులో మృతదేహం తేలియాడుతోందని గురువారం ఉదయం 7 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహం సుష్మదిగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. సుష్మ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని మాదాపూర్ పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..