యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని.. ప్రపంచానికి మోదీ ఇచ్చిన బహుమతి యోగాడే అంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీస్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను శనివారం (జూన్ 21) ఘనంగా నిర్వహించనున్నట్టు కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. 24 గంటల ముందు కౌంట్ డౌన్ మహోత్సవాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ వేడుకల్లో ప్రముఖ యోగా సంస్థలు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అలాగే.. ప్రముఖ నటినటులు సాయిధరమ్తేజ్ ఖుష్బూ, మీనాక్షి చౌదరి సైతం హాజరయ్యారు. ఈ కార్యక్రమంతో రేపటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కౌంట్డౌన్ మొదలైంది.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, ప్రముఖులు యోగా చేశారు. యోగా డేను పురస్కరించుకొని ఇక్కడ ఆసనాలు వేశారు.