21 అక్టోబర్ 1992న కర్ణాటకలోని మంగళూరులో తుళువ కుటుంబంలో పుట్టి పెరిగింది వయ్యారి భామ శ్రీనిధి శెట్టి. ఈ వయ్యారి తండ్రి రమేష్ శెట్టి. ఆయనది ముల్కి పట్టణం. తల్లి పేరు కుశల. ఆమెది తాలిపాడు గుత్తులోని కిన్నిగోలి.
కర్ణాటకలోని మిల్పిలో శ్రీ నారాయణ గురు ఇంగ్లీషు మీడియం స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. తర్వాత మంగళూరులోని సెయింట్ అలోసియస్ ప్రీ-యూనివర్శిటీ కాలేజీలో ప్రీ-యూనివర్శిటీ కోర్సు చదివింది. బెంగుళూరులోని జైన్ యూనివర్శిటీలో డిస్టింక్షన్తో బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీని అందుకుంది.
2012లో క్లీన్ & క్లియర్-స్పాన్సర్డ్ ఫ్రెష్ ఫేస్ కాంటెస్ట్లో పోటీ ఆమె మొదటి ఇద్దరి ఫైనలిస్ట్లలో ఒకరిగా నిలిచింది. తర్వాత 2015లో మణప్పురం మిస్ సౌత్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ కర్ణాటక, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిల్స్ గెలుచుకుంది. 2016లో మిస్ దివా పోటీలో పాల్గొని ఫైనలిస్ట్గా ఎంపికైంది. మిస్ సుప్రానేషనల్ ఇండియా 2016 టైటిల్ను గెలుచుకుంది.
2018లో యాష్ సరసన కెజిఎఫ్ చాప్టర్ 1లో కథానాయికగా చలనచిత్ర అరంగేట్రం చేసింది. దీని తర్వాత 2022లో కెజిఎఫ్ చాప్టర్ 2లో కూడా యాష్ పక్కన ఆకట్టుకుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. అదే ఏడాది తమిళంలో విక్రమ్కి జోడిగా నటించిన కోబ్రా సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.
తర్వాత మూడేళ్ల గ్యాప్ తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన హిట్ 3 సినిమాలో హీరోయిన్గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ వయ్యారి భామ. ప్రస్తుతం తెలుగులో సిద్దు జొన్నలగడ్డకి జోడిగా తెలుసు కదా సినిమా చేస్తుంది. అలాగే కన్నడలో కిచ్చ సుదీప్ 47వ సినిమాలో నటిస్తుంది.