Adr Report On TDP Ysrcp 2024 Election Expenditure: 2024 ఎన్నికల్లో పార్టీలు చేసిన ఖర్చుల వివరాలను ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. బీజేపీ రూ.1,493.91 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, కాంగ్రెస్ రూ.620.14 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. వైఎస్సార్సీపీ రూ.325.67 కోట్లు ఖర్చు చేసి మూడో స్థానంలో నిలిచి ప్రాంతీయ పార్టీలలో అగ్రస్థానంలో ఉంది. బీఆర్ఎస్ రూ.103.26 కోట్లతో ఏడవ స్థానంలో, టీడీపీ రూ.34.25 కోట్లతో పదవ స్థానంలో నిలిచాయి.
హైలైట్:
- ఏపీలో 2024 ఎన్నికల్లో పార్టీల ఖర్చు
- దేశంలోనే వైఎస్సార్సీపీది మూడో స్థానం
- టాప్లో బీజేపీ, రెండో స్థానంలో కాంగ్రెస్

ఇక ప్రాంతీయ పార్టీలలో వైఎస్సార్సీపీ ఎక్కువ ఖర్చు చేసింది.. ఆ పార్టీ రూ.325.67 కోట్లతో వైఎస్సార్సీపీ ఖర్చు చేసింది. బీఆర్ఎస్ రూ.103.26 కోట్లు ఖర్చు చేసింది. టీడీపీ రూ.34.25 కోట్లు ఖర్చు చేసింది. దేశంలో ఎక్కువ ఖర్చు చేసిన పార్టీల జాబితాలో బీఆర్ఎస్ 7వ స్థానంలో, టీడీపీ 10వ స్థానంలో నిలిచాయి. ప్రాంతీయ పార్టీల జాబితాలో బీఆర్ఎస్ 5వ స్థానంలో, టీడీపీ 7వ స్థానంలో ఉన్నాయి. ఏడీఆర్ సంస్థ విడుదల చేసిన జాబితాలో కీలక విషయాలను వెల్లడించారు. గతేడాది ఎన్నికల్లో బీజేపీ రూ.1493 కోట్లు, కాంగ్రెస్ 620 రూ.కోట్లు, వైఎస్సార్సీపీ రూ.325 కోట్లు, బీజేడీ రూ.278 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ రూ.147 కోట్లు, డీఎంకే రూ.145 కోట్లు, బీఆర్ఎస్ రూ.103 కోట్లు, బీఎస్పీ రూ.66 కోట్లు, ఎస్పీ రూ.48 కోట్లు, టీడీపీ రూ.34 కోట్లు ఖర్చు చేశాయి.
2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఎన్నికోట్లు ఖర్చు చేసిందో తెలుసా.. దేశంలో వైసీపీది మూడో స్థానం, ఎన్ని కోట్లంటే!
దేశంలో ఎన్నికల ప్రక్రియ, రాజకీయ వ్యవస్థలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) పారదర్శకతను పెంపొందించడానికి పనిచేస్తోంది. ఈ ఏడీఆర్ సంస్థ రాజకీయ నాయకుల నేర చరిత్ర, ఆర్థిక నేపథ్యాలు, రాజకీయ పార్టీల ఆర్థిక లావాదేవీల గురించి అధ్యయనం చేసి, సమాచారాన్ని సేకరించి, ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. రాజకీయ వ్యవస్థలో ఎన్నికల ఖర్చులను నియంత్రించడానికి, మెరుగైన పాలన కోసం, అవినీతిని తగ్గించి జవాబుదారీతనం పెంచడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతుంది.