Ongole People High BP And Diabetes: ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు మండలంలో అధిక రక్తపోటు, మధుమేహం కేసులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. బాపట్ల జిల్లాలోని 12 మండలాలు కూడా ఈ రెండు వ్యాధులు అధికంగా ఉన్న టాప్-20 మండలాల్లో ఉన్నాయి. ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో పరీక్షలు పెరిగే కొద్దీ గణాంకాలు మారే అవకాశం ఉంది.
హైలైట్:
- ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యంపై సర్వే
- ఆ నగరంలో ఎక్కువమందికి షుగర్, బీపీ
- ఎక్కువమంది షుగర్, బీపీలతో ఉన్నారు

రాష్ట్రంలోని టాప్-20 మండలాలను చూస్తే.. అధిక రక్తపోటు (హై బీపీ) ఉన్నవారు 17.17% నుంచి 12.67% మధ్య ఉన్నారు. బాపట్ల మండలం వేమూరులో అత్యధికంగా 17.17% మందికి బీపీ ఉంది. కోనసీమ జిల్లాలో అధిక రక్తపోటు (హై బీపీ) బాధితులు ఎక్కువగా ఉన్నారు. రాజోలు, అమలాపురం, మలికిపురం, మామిడికుదురు, అంబాజీపేట మండలాల్లో బీపీ ఎక్కువగా ఉంది. మధుమేహం కేసులు ఎక్కువగా ఉన్న టాప్-20 మండలాల్లో 10.38% నుంచి 7.34% వరకు ఉన్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో 10.38% కేసులు ఉన్నాయి. టాప్-20లో కొరిశపాడు, చీరాల, జె.పంగులూరు మండలాలు ఉన్నాయి.
ఏపీలోని ఆ నగరంలో ప్రతి నలుగురిలో ఒకరికి హై బీపీ, షుగర్.. కారణం ఇదేనట
సర్వేలో తేలిన వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా అధిక రక్తపోటు ఉన్నవారు 16.61%, మధుమేహం ఉన్నవారు 13.09%, రెండు సమస్యలు ఉన్నవారు 8.57%మంది ఉన్నారు. పరీక్షల సంఖ్య పెరిగే కొద్దీ.. ఈ లెక్కలు మళ్లీ మారుతాయంటున్నారు అధికారులు. ప్రజలు ఆహారపు అలవాట్లను మార్చుకుని, వ్యాయామం చేస్తే ఈ వ్యాధుల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మొత్తం ఏపీలో ప్రజలకు బీపీ, షుగర్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.