అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. అల్లూరి జిల్లాకు చెందిన 26,835 మంది గిరిజన విద్యార్థులు విశాఖలో ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి ప్రతాప్రావ్ జాదవ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. యోగా గురువు శ్రీనివాస్ విద్యార్థుల చేత ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డుల ప్రతినిధుల పర్యవేక్షణలో జరిగింది.
హైలైట్:
- సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఏపీ గిరిజన విద్యార్థులు
- ఒకేసారి 27 వేల మందితో యోగాసనాలు
- ప్రాల్గొన్న మంత్రి లోకేష్

ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్తోపాటు కేంద్ర ఆయుష్శాఖ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యోగా గురువు శ్రీనివాస్ విద్యార్థుల చేత సూర్యనమస్కారాలు వేయించారు. నారా లోకేష్ కూడా యోగాసనాలు వేసి.. విద్యార్థుల్లో జోష్ నింపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం వచ్చిన విద్యార్థులకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి భుజానికి దీన్ని తగిలించారు. అంతేకాక యోగాంధ్ర కార్యక్రమం కోసం వచ్చిన స్టూడెంట్స్ వివరాలు తెలుసుకునేందుకు వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కూడా కేటాయించారు. విద్యార్థులందరూ యూనిఫామ్లోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విద్యార్థులు సూర్యనమస్కారాలు చేస్తుండగా.. ప్రపంచ గిన్నిస్ రికార్డుల కన్సల్టెంట్ నిశ్చల్ బరోత్తో పాటుగా మరో 42 మంది సభ్యులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వేలాది మంది విద్యార్థులను వందల సంఖ్యల్లో బస్సుల్లో విశాఖకు తీసుకువవచ్చారు. శుక్రవారం మధ్యాహ్నానికే వీరంతా వేదిక వద్దకు చేరుకున్నారు. విద్యార్థులు భోజనాలు చేశాక.. వారంతా తమకు కేటాయించిన బ్లాకులకు వెళ్లారు.
ఆతర్వాత కార్యక్రమం ప్రారంభించారు. యోగా గురువు చెప్పిన ప్రతి ఆసనాన్ని ఒకే క్రమంలో అన్ని బ్లాక్లలోని విద్యార్థులు చేసిన దృశ్యం చూపరులను కట్టిపడేసింది. గురువు చెప్పిన ప్రతి ఆసనాన్ని విద్యార్థులు చాలా చక్కగా వేసి చూపించారు. దీంతో ఈ కార్యక్రమం సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.