Vijayawada Durgamma Devotee Donates Gold Necklace: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు విద్యాధరపురానికి చెందిన భక్తుడు శ్రీనివాసరావు రూ.12 లక్షల విలువైన బంగారు హారాన్ని సమర్పించారు. భక్తులకు దుర్గమ్మ సేవ చేసుకునే అవకాశం కల్పిస్తూ రాజగోపుర ప్రాంగణంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఈవో శీనానాయక్ తెలిపారు. అంతేకాకుండా, ఆలయ పరిపాలన సక్రమంగా జరిగేందుకు ఏఈవోలు, సూపరింటెండెంట్ల బదిలీలు జరిగాయి. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించారో కూడా తెలియజేశారు.
హైలైట్:
- విజయవాడ దుర్గమ్మకు ఖరీదైన కానుక
- 105 గ్రాముల హారాన్ని అందజేశారు
- దుర్గమ్మకు బంగారు హారాన్ని కానుకగా

విజయవాడ దుర్గమ్మకు భక్తుడి ఖరీదైన కానుక.. ఆ బంగారు హారం విలువ ఎంతో తెలుసా!
మరోవైపు విజయవాడ దుర్గగుడిలో పనిచేసే ఏఈవోలు, సూపరింటెండెంట్ల బదిలీలు జరిగాయి. పరిపాలన సక్రమంగా జరగడానికి ఈ బదిలీలు చేశామని.. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించారో కూడా తెలియజేశారు. ‘ఏఈవో బి.వి.రెడ్డికి అన్నదానం, వేద పాఠశాల, సత్రాల బాధ్యతలు ఇచ్చారు. ఎన్.రమేష్ బాబుకు మెయిన్ టెంపుల్, ప్రొవిజన్ స్టోర్సు, పూజలు, ట్రస్టు బోర్డు, ఉపాలయాల బాధ్యతలు అప్పగించారు. పి.చంద్రశేఖర్కు ఎస్టాబ్లిష్మెంట్, సెక్యూరిటీ, శానిటేషన్ బాధ్యతలు ఇచ్చారు. అసిస్టెంట్ కమిషనర్ రంగారావుకు సీవీరెడ్డి ఛారిటీస్, ల్యాండ్స్, లీగల్, ఆర్టీఐ యాక్టు బాధ్యతలు అప్పగించారు. కె.గంగాధర్కు కనకదుర్గప్రభ, పౌర సంబంధాలు, గవర్నమెంట్ స్కీమ్స్ కోఆర్డినేషన్ బాధ్యతలు ఇచ్చారు ఎం.తిరుమలరావుకు కేశఖండనశాల, దత్త దేవాలయాలు, దుర్గాఘాట్, హారతుల బాధ్యతలు అప్పగించారు. పి.సుధారాణికి ఆడిట్, చీరలు, ప్రథమ చికిత్సా కేంద్రం బాధ్యతలు అప్పగించారు. ఎం.ఎస్.ఎల్.శ్రీనివాస్కు అకౌంట్స్, ప్రసాదాల తయారీ బాధ్యతలు ఇచ్చారు’ అని తెలిపారు. సూపరింటెండెంట్లు కూడా బదిలీ అయ్యారు.. వారికి కూడా ఆలయంలో ఆయా బాధ్యతల్ని అప్పగించారు.