Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Watch: సోషల్ మీడియాలో కొత్త అతిథి హల్‌చల్‌.. భారతదేశమంతటా తిరుగుతూ బబ్లూ బందర్‌ రికార్డ్‌..!

21 June 2025

అబ్బ.. చల్లని కబురు వచ్చేసింది.. 3 రోజులు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

21 June 2025

రూ.700 పెన్షన్‌ పెంపు.. సీఎం ప్రకటన! వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు వర్తింపు

21 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Visakhapatnam Yogandhra 2025 Guinness Record,విశాఖపట్నం యోగాంధ్ర 2025 గిన్నిస్ రికార్డ్.. గుజరాత్ పేరిట ఉన్న రికార్డ్ బ్రేక్, ప్రత్యేకతలివే – andhra pradesh visakhapatnam yogandhra creates new guinness record
ఆంధ్రప్రదేశ్

Visakhapatnam Yogandhra 2025 Guinness Record,విశాఖపట్నం యోగాంధ్ర 2025 గిన్నిస్ రికార్డ్.. గుజరాత్ పేరిట ఉన్న రికార్డ్ బ్రేక్, ప్రత్యేకతలివే – andhra pradesh visakhapatnam yogandhra creates new guinness record

.By .21 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Visakhapatnam Yogandhra 2025 Guinness Record,విశాఖపట్నం యోగాంధ్ర 2025 గిన్నిస్ రికార్డ్.. గుజరాత్ పేరిట ఉన్న రికార్డ్ బ్రేక్, ప్రత్యేకతలివే – andhra pradesh visakhapatnam yogandhra creates new guinness record
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Visakhapatnam Yogandhra Creates Guinness Record: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం గిన్నిస్ రికార్డు సృష్టించింది. 3.01 లక్షల మంది యోగాసనాలు వేసి గతంలో సూరత్‌లో నమోదైన రికార్డును అధిగమించారు. ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు 26 కిలోమీటర్ల మేర ఈ కార్యక్రమం జరిగింది. గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేసి మరో రికార్డు సాధించారు. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ థీమ్‌తో కార్యక్రమం జరిగింది.

హైలైట్:

  • విశాఖపట్నం యోగాంధ్ర గిన్నిస్ రికార్డ్
  • ఏకంగా 3.01 లక్షల మందితో యోగాసనాలు
  • గతంలో సూరత్‌లో 1.47 లక్షల మందితో
గిన్నిస్‌ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర
గిన్నిస్‌ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం సరికొత్త రికార్డు సృష్టించింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు యోగాంధ్ర గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ కార్యక్రమంలో 3.01 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో సూరత్‌లో 1.47 లక్షల మందితో నిర్వహించిన యోగా రికార్డును యోగాంధ్ర అధిగమించింది. విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ నుండి భీమిలి వరకు లక్షల మంది ఒకేసారి యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు దాదాపు 26 కిలోమీటర్ల పరిధిలో లక్షల మంది యోగాసనాలు వేశారు. ఈ మేరకు గిన్నీస్ బుక్ ప్రతినిధులు రికార్డుకు సంబంధించిన పత్రాలను అందజేశారు. ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ప్రజా ప్రతినిధులు ఈ యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.విశాఖలో యోగాంధ్ర నిర్వహణపై మంత్రి నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రుల కోరికలను ప్రధాని నెరవేరుస్తున్నారని.. అందుకే ప్రధానికి గిన్నిస్ రికార్డు కానుక ఇవ్వాలని యోగాంధ్ర నిర్వహించినట్లు చెప్పారు. అనుకున్న దానికంటే ఎక్కువ మంది ప్రజలు యోగాంధ్రలో భాగస్వాములయ్యారన్నారు. ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్లే యోగాంధ్ర విజయవంతం అయ్యిందన్నారు. ప్రధాని నరేంద్ర పిలుపు మేరకు ప్రజలు భారీగా పాల్గొన్నారన్నారు.

యోగాంధ్ర కార్యక్రమం కోసం ఏర్పాట్లు బాగా చేయడం వల్లే ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని.. ప్రధాని వ్యాఖ్యలు తమపై మరింత బాధ్యతను పెంచాయన్నారు. యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రుల విజయంగా అభిప్రాయపడ్డారు. అమరావతిని పరిపాలన సౌలభ్యం కోసం రాజధానిగా ఏర్పాటు చేశామన్నారు మంత్రి లోకేష్. అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని.. దక్షిణ భారతదేశంలో విశాఖపట్నాన్ని ఒక గొప్ప ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖపట్నంలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

మరోవైపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరో రికార్డును కూడా సాధించారు. శుక్రవారం రోజు గిరిజన విద్యార్థులు ఏకంగా గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌లో శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 106 పాఠశాలలకు చెందిన 25వేల మంది విద్యార్థులు పాల్గొని 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు పర్యవేక్షించారు’ అని అధికారులు తెలిపారు. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు నేతలు కలిసి ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ అనే థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.. విశాఖపట్నం యోగాంధ్రకు భారీ ఏర్పాట్లు చేశారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Padmavati Express Train Theft,రైళ్లలో మెల్లిగా వెళ్లి సిగ్గులేకుండా ఇదేం పని.. తెల్లవారుజామునే పనికానిచ్చేస్తున్నారు – robbery on padmavati express from secunderabad to tirupati

21 June 2025

దుర్గమ్మ భక్తులకు గుడ్‌ న్యూస్.. ఇకపై కొండపైకి వెళ్లకుండానే దర్శన టికెట్లు పొందొచ్చు!

21 June 2025

Andhra Pradesh National Highways Rs 12000 Crores,ఏపీలోని ఈ హైవేలకు రూ.12వేల కోట్లు.. ఈ రూట్‌లలోనే రెండు, నాలుగు లైన్లుగా.. ఆ జిల్లాల దశ తిరిగినట్లే – union government green signal for rs 12152 crores to andhra pradesh national highways

21 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Watch: సోషల్ మీడియాలో కొత్త అతిథి హల్‌చల్‌.. భారతదేశమంతటా తిరుగుతూ బబ్లూ బందర్‌ రికార్డ్‌..!

21 June 2025

ఇంటర్నెట్‌లో చాలా మంది వ్లాగర్ల వీడియోలను మీరు చూసి ఉంటారు. వారు తమ వ్లాగ్‌ల ద్వారా దేశాన్ని, ప్రపంచాన్ని చూపిస్తారు.…

అబ్బ.. చల్లని కబురు వచ్చేసింది.. 3 రోజులు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

21 June 2025

రూ.700 పెన్షన్‌ పెంపు.. సీఎం ప్రకటన! వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు వర్తింపు

21 June 2025

Priya Vadlamani: కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు దింపుతున్న హుషారు బ్యూటీ..

21 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Watch: సోషల్ మీడియాలో కొత్త అతిథి హల్‌చల్‌.. భారతదేశమంతటా తిరుగుతూ బబ్లూ బందర్‌ రికార్డ్‌..!

21 June 2025

అబ్బ.. చల్లని కబురు వచ్చేసింది.. 3 రోజులు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

21 June 2025

రూ.700 పెన్షన్‌ పెంపు.. సీఎం ప్రకటన! వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు వర్తింపు

21 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.