Visakhapatnam Yogandhra Creates Guinness Record: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం గిన్నిస్ రికార్డు సృష్టించింది. 3.01 లక్షల మంది యోగాసనాలు వేసి గతంలో సూరత్లో నమోదైన రికార్డును అధిగమించారు. ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు 26 కిలోమీటర్ల మేర ఈ కార్యక్రమం జరిగింది. గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేసి మరో రికార్డు సాధించారు. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ థీమ్తో కార్యక్రమం జరిగింది.
హైలైట్:
- విశాఖపట్నం యోగాంధ్ర గిన్నిస్ రికార్డ్
- ఏకంగా 3.01 లక్షల మందితో యోగాసనాలు
- గతంలో సూరత్లో 1.47 లక్షల మందితో

యోగాంధ్ర కార్యక్రమం కోసం ఏర్పాట్లు బాగా చేయడం వల్లే ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని.. ప్రధాని వ్యాఖ్యలు తమపై మరింత బాధ్యతను పెంచాయన్నారు. యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రుల విజయంగా అభిప్రాయపడ్డారు. అమరావతిని పరిపాలన సౌలభ్యం కోసం రాజధానిగా ఏర్పాటు చేశామన్నారు మంత్రి లోకేష్. అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని.. దక్షిణ భారతదేశంలో విశాఖపట్నాన్ని ఒక గొప్ప ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. విశాఖపట్నంలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
మరోవైపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరో రికార్డును కూడా సాధించారు. శుక్రవారం రోజు గిరిజన విద్యార్థులు ఏకంగా గిన్నిస్ రికార్డు సృష్టించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 106 పాఠశాలలకు చెందిన 25వేల మంది విద్యార్థులు పాల్గొని 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు పర్యవేక్షించారు’ అని అధికారులు తెలిపారు. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు నేతలు కలిసి ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ అనే థీమ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.. విశాఖపట్నం యోగాంధ్రకు భారీ ఏర్పాట్లు చేశారు.