
మన వేద, పురాణ గ్రంథాలలో యోగా గురించి ప్రస్తావించబడింది. మన దేశంలో పుట్టిన యోగా క్రమంగా ప్రజలకు దూరమైంది. అయితే మళ్ళీ యోగా అపూర్వ ఆదరణను సొంతం చేసుకుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రజలు దీనిని తమ దినచర్యలో భాగంగా చేర్చుకుంటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా గొప్ప యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. యోగా మన శరీరాన్ని బాహ్యంగా ఫిట్గా ఉంచడంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది. ఈ యోగా దినోత్సవం సందర్భంగా.. యోగాతో జీవితం మెరుగుపడిన హీనా చాంద్వానీ కథను ఈ రోజు తెలుసుకుందాం.. వాస్తవానికి ఆమెకు తీవ్రమైన వెన్నునొప్పితో ఇబ్బంది పడేది. వైద్యులు కూడా ఒకప్పుడు వెన్ను నొప్పిని నయం చేయలేమంటూ తేల్చి చెప్పేశారు.
హీనా చాంద్వానీ తన జీవితాన్ని తానే మార్చుకోవాలని భావించింది. యోగా నిపుణురాలు మాన్సీ గులాటి (25 సంవత్సరాల అనుభవం ఉంది. యోగా వేదికను నడుపుతోంది) మార్గదర్శకత్వంలో తాను యోగా సాధన చేయడం ప్రారంభించానని, నేడు తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. హీనా చాంద్వానీ యోగాతో తనని తాను పూర్తిగా ఆరోగ్యంగా ఎలా చేసుకుందో ఈ రోజు తెలుసుకుందాం.
ఆశను వదులుకొని హీనా
హీనా చాంద్వానీని తన అనారోగ్యం గురించి చెబుతూ తనకు తీవ్రమైన వెన్నునొప్పి ఉంది. ఎంతగా అంటే లేచినా లేదా కూర్చున్నా భరించలేని భాదకలిగేది. దీంతో వెన్ను నొప్పికి చికిత్సను తీసుకున్నాను. అయితే ఎన్ని రకాల మందులు వేసుకున్నా.. తనకు వెన్ను నొప్పి తగ్గలేదు. ఆ దశ తనకు చాలా బాధాకరంగా గడిచిందని తెలిపింది. ఇక నేను జీవితాంతం కోలుకోలేనని.. జీవితాంతం ఈ నొప్పితో జీవించాల్సి ఉంటుందని ఆలోచించడం మొదలు పెట్టాను. అందుకు తగినట్లుగా తాను పూర్తిగా కోలుకోవడం సాధ్యం కాదని వైద్యులు కూడా చెప్పారు. దీని తర్వాత. తాను ధైర్యాన్ని కూడగట్టుకుని..మాన్సీ మేడమ్ పర్యవేక్షణలో యోగా చేయడం ప్రారంభించానని చెప్పింది.
కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపించింది
యోగా వల్ల ఫలితాలు ఆలస్యమవుతాయని చాలా మంది భావిస్తారు. అయితే ఇదే విషయంపై హీనా చాంద్వానీ తన అభిప్రాయాన్ని తెలిపింది. ఎన్ని రకాల చికిత్సలు తీసుకున్నప్పటికీ నొప్పి నుంచి ఉపశమనం లభించలేదు. అయితే యోగా ప్రారంభించిన కేవలం ఒక నెలలోనే తనకు ఉపశమనం లభించిందని వెల్లడించింది. రోజూ 40 నిమిషాలు, కొన్నిసార్లు 1 గంట కూడా యోగా సాధన చేస్తానని.. తాను యోగా సాధన ప్రారంభించి దాదాపు 4 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నేటి వరకూ యోగా చేయడం మానలేదని.. నేటికీ నేను రోజూ యోగా సాధన చేస్తాను” అని అన్నారు.
హీనా ఏ యోగాసనాలు వేసేదంటే
బాలాసనం, నౌకాసనం, భుజంగాసనం, శవాసనం మొదలైన వాటిని తన దినచర్యలో భాగంగా చేసుకున్నానని హీనా చాంద్వానీ చెబుతోంది. ఈ విధంగా ఈ రోజు వెన్ను నొప్పిని పూర్తిగా నయం చేసుకున్నాను. అంతేకాదు తనకు ఇప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు.. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను.. ఇదంతా యోగాతో మాత్రమే సాధ్యం అయిందని చెప్పింది.
మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడింది
ఏ చికిత్స తీసుకున్నా నొప్పి నుంచి ఉపశమనం లభించనప్పుడు.. ఇక నేను ఎప్పటికీ కోలుకోలేనని.. తన జీవితం సాధారణ స్థితికి చేరుకోదని భావించిన తర్వాత తన మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితమైందని హీనా చెప్పింది. తాను భస్త్రిక, కపాలభాతి, అనులోమ విలోమ , ఓం మంత్రం వంటి ప్రాణాయామాలు చేస్తాను. వీటి వలన తన మానసిక ఆరోగ్యం చాలా మెరుగుపడింది. ఈ విధంగా తన జీవితాన్ని మార్చివేసిందని కనుక ప్రతి ఒక్కరూ యోగాని జీవితంలో ఒక భాగంగా చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని హీనా చాంద్వానీ సూచిస్తోంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)