
మెగాస్టార్ చిరంజీవి.. జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. బోళాశంకర్ లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత చిరంజీవి ఇప్పుడు విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సోసియో-ఫాంటసీ కాన్సప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వశిష్ట. . యూవి క్రియేషన్స్ బ్యానర్పై వి. వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. చిరంజీవి, ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారని అంచనా. ఈ సినిమాలో ఆయన సరికొత్త అవతారంలో దర్శనమిస్తారని, హనుమాన్ భక్తుడిగా ఉండే పాత్రలో నటిస్తున్నారని టాక్. ఇక ఈ సినిమాలో త్రిష కృష్ణన్, అషికా రంగనాథ్, రమ్య పసుపులేటి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా ఇప్పటికే సెకండ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. అలాగే ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించనున్నారు. అదేవిధంగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే విశ్వంభర సినిమాలో భీమ్స్ ఓ స్పెషల్ సాంగ్ కు కంపోజ్ చేయనున్నారని ఇప్పటికే టాక్ వినిపిస్తుంది. సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఒక్క స్పెషల్ సాంగ్ కు మాత్రం భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారని తెలుస్తుంది.
ఇక ఈ స్పెషల్ సాంగ్ కోసం కన్నడ బ్యూటీని రంగంలోకి దింపుతున్నారని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు అందాల భామ నిశ్వికా నాయుడు. ప్రభుదేవాతో కలిసి ‘హితలకా కరిబయడా మావ’ అంటూ సోషల్ మీడియాను ఊపేసింది. ఈ సాంగ్ తో ఈ అమ్మడు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు మెగాస్టార్ కోసం ఆమెను రంగంలోకి దింపుతున్నారని తెలుస్తుంది. త్వరలోనే దీని పై పూర్తి క్లారిటీ రానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి