థియేటర్లలో సోసో గా ఆడిన ఈ టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జూన్ 13న ఓటీటీలోకి వచ్చింది. బిగ్ స్క్రీన్ పై అంతగా ఆకట్టుకోని ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై మాత్రం దూసుకెళుతోంది. అమెజాన్ ప్రైమ్లో ఇండియా వ్యాప్తంగా ఏకంగా టాప్-2లో ట్రెండ్ అవుతోంది. ఇదొక హైదరాబాద్లో జరిగే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మర్డర్ మూవీ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సినిమా సాగుతుంటుంది. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే.. నిడివి చాలా తక్కువగా ఉంది. అయితేనేం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, దిమ్మతిరిగే ట్విస్టులు ఆడియెన్స్ ను పక్కకు కదలనియ్వవు. జయరామ్ అనే ఒక వ్యాపారవేత్త, తన భార్య దివ్యతో తరచూ గొడవలు పడుతుంటాడు. ఒక రోజు ఆ గొడవ తారా స్థాయికి వెళుతుంది. జయరామ్ భార్యపై చేయి చేసుకుంటాడు. అయితే ఆ తర్వాత కొన్ని గంటలకే దివ్య తన బెడ్ రూమ్ లో ఉరికి వేలాడుతుంటుంది. అందరూ ఇది ఆత్మహత్య అనుకుంటారు. దీంతో పనిమనిషి వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తుంది. రంగంలోకి దిగిన ఒక పోలీసాఫీసర్ దివ్య మరణం ఆత్మ హత్య కాదని భావిస్తాడు. అతని ఇన్వెస్టిగేషన్ లో ఇది హత్య అని నిర్ధారణ అవుతుంది.
దీంతో పోలీసులు జయరామ్, అతని సవతి పిల్లలు, పనిమనిషి, జయరామ్ సోదరుడైన ఎన్ఐఏ ఆఫీసర్ ను విచారిస్తారు. విచారణలో అందరూ అనుమానితులుగానే కనిపిస్తారు. కానీ దివ్య మరణానికి ఏ ఒక్కరూ కారణం కాదని తెలుస్తోంది. ఇదే సమయంలో పనిమనిషికి, జయరామ్ కి మధ్య ఎఫైర్ నడుస్తుందన్న విషయం పోలీసులకు తెలుస్తుంది. కానీ దివ్య హత్యకు అదొక్కటే కారణం కాదని తెలుస్తుంది. మరి ఆమె మరణానికి నిజమైన కారణం ఏమిటి? పోలీసులు ఈ కేసును ఎలా ఛేదిస్తాడు? అసలు హంతకుడు ఎవరు అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అందరినీ ఉలిక్కిపడేలా చేస్తుంది.
ఇవి కూడా చదవండి
గాయత్రి భార్గవి నటన హైలెట్..
ఈ సినిమా పేరు బ్లైండ్ స్పాట్.. రాకేష్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీలో నవీన్ చంద్ర, రాశి సింగ్, రవి వర్మ, అలీ రెజా, గాయత్రి భార్గవి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. కేవలం 1 గంట 31 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.