విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్.. దుర్గమ్మ దర్శన టికెట్ల కోసం ఇకపై ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. భక్తుల సౌకర్యం కోసం విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద కనకదుర్గమ్మ దేవస్థానం అధికారులు కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ ద్వారా దర్శన టికెట్లతో పాటుగా.. ఆర్జిత సేవలు బుకింగ్, కనక దుర్గమ్మ లడ్డూ ప్రసాదాలు విక్రయాలు వంటి సేవలు అందుబాటులోకి తెచ్చారు. రైల్వేస్టేషన్తో పాటుగా విజయవాడ బ స్టాండ్ వద్ద కూడా ఇలాంటి కౌంటర్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.

*అన్నదాత సుఖీభవ పథకం.. డబ్బులు పడేది అప్పుడే..!
భక్తుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విజయవాడ బస్టాండ్, విజయవాడ రైల్వే స్టేషన్లతో పాటుగా తారాపేట మాడపాటి గెస్ట్ హౌస్, వన్ టౌన్ జమ్మి దొడ్డి వద్ద బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అధికారులు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా విజయవాడ రైల్వేస్టేషన్లోని ఫ్లాట్ పామ్ 1 సమీపంలో దేవస్థానం అధికారులు కనకదుర్గమ్మ దర్శనం టికెట్ల కౌంటర్ తెరిచారు. ఈ కౌంటర్ ద్వారా దర్శన టికెట్లతో పాటుగా లడ్డూ ప్రసాదాలు, ఆర్జిత సేవల బుకింగ్, విరాళాలు చెల్లింపులు వంటి సేవలు అందుబాటులోకి తెచ్చారు. భక్తుల సౌలభ్యం కోసం కంప్యూటర్ మీద అవగాహన ఉన్న సిబ్బందిని ఈ కౌంటర్లో విధుల కోసం కేటాయిస్తున్నారు.
*బాలకృష్ణపై యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు.. ఉంటే ఎంత, పోతే ఎంత అంటూ.!
కనకదుర్గమ్మ భక్తులకు శుభవార్త.. ఇకపై అక్కడ కూడా దర్శన టికెట్లు
మరోవైపు కనకదుర్గమ్మ దర్శన టికెట్ల కోసం గతంలో ఆలయానికి కచ్చితంగా వెళ్లాల్సి ఉండేది. ఇంద్రకీలాద్రిపైనా, అలాగే కొండ దిగువన టికెట్లు అందుబాటులో ఉండేవి అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే దుర్గమ్మ భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా.. ఆలయ అధికారులు అమ్మవారి ఆలయ చుట్టుపక్కల్లోని కొన్ని ముఖ్యమైన చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ కౌంటర్ల ద్వారానే టికెట్ బుకింగ్స్, లడ్డు ప్రసాదాల విక్రయాలు చేపడుతున్నారు.
కనకదుర్గమ్మకు బంగారు హారం కానుక
మరోవైపు కనకదుర్గమ్మకు భారీ కానుక అందింది. విజయవాడ విద్యాధరపురానికి చెందిన శ్రీనివాసరావు అనే భక్తుడు కనకదుర్గమ్మకు బంగారు హారాన్ని అందజేశారు. 105 గ్రాముల బరువు ఉన్న ఈ బంగారు హారం విలువ రూ.12 లక్షలు ఉంటుందని అంచనా. శుక్రవారం ఈ హారం ఆలయ అధికారులకు అందజేశారు. దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం.. ఈవో శీనానాయక్కు అందజేశారు. అనంతరం దాత కుటుంబానికి అధికారులు అమ్మవారి దర్శనం చేయించారు. వేదపండితులు ఆశీర్వచనం అందించగా.. కనకదుర్గమ్మ ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.