AP Rain Alert: రుతుపవనాలు ముందే వచ్చినా, ఆ తర్వాత వర్షాలు మాయమయ్యాయి. రైతులు ఆశగా ఎదురు చూస్తుండగా, అమరావతి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, మరో మూడు రోజులు తేలికపాటి నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తా, యానాంలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
హైలైట్:
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి వార్త
- రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు
- మరో 3 రోజుల పాటు వర్షాలు

అంతేకాక ఈ మూడు రోజులు రాష్ట్రంలో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. అలానే ఈ మూడు రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, చిరు జల్లులు కురిసేందుకు అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక శనివారం శ్రీశైలం, కాకినాడ, యానాం, అమలాపురం, నెల్లూరు, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో గత 24 గంటల వ్యవధిలో ఏపీలో శ్రీశైలంలో గరిష్ఠంగా 40 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలానే రాజమహేంద్రవరం, చిత్తూరు, అమలాపురంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. అలానే రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. మరో 3 రోజుల పాటు
ఈ క్రమంలో నేడు(ఆదివారం), రేపు (సోమవారం) ఉత్తర కోస్తా, యానాంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. మరోసారి రాష్ట్రానికి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వ్యవసాయ పనులు నిమిత్తం బయటకు వెళ్లే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.