Devotees Rush Continues in Tirumala: వేసవి సెలవులు అయిపోయినా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. వారాంతం కావడంతో రద్దీ మరింత పెరిగింది. భక్తులు శిలాతోరణం వరకు క్యూలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. నిన్న 90 వేల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. 4.3 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇంతకీ ఈ రద్దీ ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి!
హైలైట్:
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- శిలాతోరణం వరకు క్యూలైన్
- దర్శనానికి 24 గంటల సమయం

శనివారం ఒక్క రోజే 90,087 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. వారిలో 41,891 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక హుండీ కానుకల ద్వారా 4.3 కోట్ల రికార్డ్ బ్రేకింగ్ ఆదాయం వచ్చిందని వెల్లడించారు. మరి కొన్ని రోజుల పాటు తిరుమలలో ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. టీటీడీపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి ఆలయంలో సంప్రదాయాలకు తూట్లు పొడుస్తున్నారని.. వేద పారాయణాన్ని పక్కన పెట్టి.. వేదం వద్దని ఒత్తిడి చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే వీటిపై టీటీడీ స్పందించింది. భూమన కరుణాకరరెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవాలు, అభూత కల్పనలే అని స్పష్టం చేసింది. కచ్చితమైన ఆధారాలు లేకుండా నిర్ధిష్టమైన టీటీడీ మీద బురద జల్లడం మీద బురద జల్లడం శోచనీయమంటూ ఒక ప్రకటనను విడుదల చేసింది. వేద పారాయణానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందని.. వేద పారాయణదారులని అవమానిస్తున్నారనేది పూర్తిగా అవాస్తవం అని టీటీడీ స్పష్టం చేసింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బ తీయవద్దని కోరింది.