జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ జరుపుతున్న దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను తాజాగా అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన పర్వీజ్ అహ్మద్, బషీర్లను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో బైరసన్ వ్యాలీలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది చనిపోయారు. నలుగురు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలు తీశారు. తర్వాత అడవుల్లోకి పారిపోయారు. అప్పట్నుంచి టెర్రరిస్టుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. స్థానికుల సహకారం ఉండి ఉండొచ్చనే కోణంలో కూడా ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగించింది. ఈ క్రమంలోనే ఆ నలుగురు ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన ఇద్దరిని గుర్తించి ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశంలో అనేక చోట్ల పాకిస్థాన్కు ఏజెంట్లుగా పనిచేసిన చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మన దేశంలో ఉంటూ పాక్ కోసం పనిచేసిన ప్రముఖ యూట్యూబర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భీకర దాడులు చేసింది. ఆ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఉగ్రవాద మూలాలు పూర్తిగా అంతం చేసే వరకు ఆపరేషన్ సిందూర్ ముగియదని కూడా ప్రభుత్వం ప్రకటించింది.
NIA arrests 2 for harbouring Pakistani terrorists in Pahalgam terror attack case
Read @ANI Story | https://t.co/r53gRu99Es#NIA #Pakistani #terrorists #Pahalgamterrorattack pic.twitter.com/lPelopjZmB
— ANI Digital (@ani_digital) June 22, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి