పల్నాడులో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఏటుకూరు బైపాస్ వద్ద చీలి సింగయ్య అనే వ్యక్తి మరణించిన ఘటన కలకలం రేపింది. జగన్ వాహనం ఢీకొనడం వల్లే సింగయ్య చనిపోయాడని తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ద్వారా తెలుస్తోంది. తొలుత ప్రైవేట్ వాహనం ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. కానీ ప్రస్తుతం వెెలుగులోకి వచ్చిన వీడియోలో జగన్ వాహనం టైరు కింద సింగయ్య ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి వివరాలు మీ కోసం..
హైలైట్:
- సింగయ్య మృతి ఘటనలో ట్విస్ట్
- జగన్ వాహనం కింద పడే సింగయ్య మృతి
- వెలుగులోకి మరో వీడియో

అయితే ముందుగా దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఒక వాహనం ఢీకొనడం వల్లే సింగయ్య చనిపోయాడని ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ తర్వాత బయటకు వచ్చిన వీడియోలో.. ప్రైవేటు వాహనం ఢీకొనటంతో చీలి సింగయ్య రోడ్డుపై పడిపోయారని.. కారు టైరు అతని భుజం మీదుగా వెళ్లిందని గుర్తించారు. ఇక తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో సింగయ్యను ఢీకొట్టింది జగన్ వాహనమే అని తెలిసింది.
జగన్ వాహనం కింద పడే సింగయ్య మృతి.. వెలుగులోకి మరో వీడియో
సింగయ్య వాహనం టైరు కింద ఉండగా.. అదే వాహనం మీద జగన్ నిలబడి.. అభిమానులకు అభివాదం చేస్తున్నారు. పల్నాడు పర్యటన నేపథ్యంలో.. జగన్ను కలిసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. దీంతో జగన్.. వాహనం మీద నిలబడి వారికి అభివాదం చేస్తున్నాడు. సరిగా ఇదే వాహనం కింద సింగయ్య పడిపోయాడు. అతడి భుజం మీదకు వాహనం ఎక్కింది. అలానే ముందుకు సాగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే ముందుగా పోలీసులు ఓ ప్రైవేటు వాహనం ఢీకొట్టడం వల్ల సింగయ్య చనిపోయాడని తెలిపారు. ఒక ప్రైవేట్ వాహనం ఢీకొట్టడంతో సింగయ్య రోడ్డు మీద పడిపోయారని.. ఆ తర్వాత ఆ వాహనం టైరు అతని భుజం మీదుగా వెళ్లిందన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సింగయ్యను గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సింగయ్య మృతిపై అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి అంటున్నారు.