ఆంధ్రప్రదేశ్లో త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు నగరాల్లో తిరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకం కింద విజయవాడకు 100 బస్సులు కేటాయించనున్నారు. కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో, ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యాధరపురం డిపోలో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ బస్సులు 15 రూట్లలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ పేరుతో నడుస్తాయి. డీజిల్ వ్యయం తగ్గడంతో ఆర్టీసీకి ఆర్థిక భారం తగ్గుతుంది.

*సీనియర్ అమ్మాయితో ప్రేమ.. వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు.. చివరకు ఇలా.!
మరోవైపు విద్యాధరపుం ఆర్టీసీ డిపోకే 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించనున్నట్లు తెలిసింది. 15 రూట్లలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ పేరుతో ఈ ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నారు. కాళేశ్వరరావు మార్కెట్ – ఆటోనగర్, రైల్వేస్టేషన్ – ఆటోనగర్, హెచ్బీ కాలనీ – ఆటోనగర్, హెచ్బీ కాలనీ – పెనమలూరు, సిటీబస్ పోర్టు – మైలవరం, సిటీ బస్పోర్టు – విస్సన్నపేట, కాళేశ్వరరావు మార్కెట్ – పామర్రు, ఎన్ఎస్బీ నగర్ – ఆటోనగర్, పీఎన్బీఎస్ – విస్సన్నపేట, జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ – ఆటోనగర్, కబేళా – గవర్నమెంట్ ప్రెస్, జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ – తాడిగడప రూట్ల మీదుగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ పేర్లతో ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నారు.
విజయవాడకు ఎలక్ట్రిక్ బస్సులు.. తిరిగే రూట్లు ఇవే.!
మరోవైపు ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ కోసం విద్యాధరపురం డిపోలో 6000 కేవీ సామర్థ్యంతో ఛార్జింగ్ స్టేషన్ సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 100 కి.మీలకు పైగా నడుస్తాయి. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ఓ సంస్థకు అప్పగించారు. ఏపీఎస్ఆర్టీసీ కేవలం సిబ్బంది నియమించి.. నగదు లావాదేవీలను నిర్వహించనుంది.
మరోవైపు విజయవాడలో ప్రస్తుతం 400 వరకు సిటీ బస్సులు నడుస్తున్నాయి. బస్సుల నిర్వహణలో డీజిల్ వ్యయం ఎక్కువగా ఉంది. ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తే వాటి నిర్వహణ వ్యయం తక్కువ కావడంతో ఆర్థిక భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే నగరంలో కాలుష్యం కూడా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.