వర్షకాలం వచ్చిందంటే చాలు చాలా మంది తమ ఇంటి ఆవరణంలో అందమైన మొక్కలు, ఈ సీజన్లోనే పుష్పించే మొక్కలు పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇక వర్షకాలంలో తేమ ఉండటం వలన చాలా మొక్కలు త్వరగా పెరిగి, అవి పుష్పిస్తుంటాయి. అయితే వర్షకాలంలో పుష్పించే అందమైన మొక్కలు ఏవో ఇప్పుడు చూద్దాం.
రోజ్మెరీ పూలు అందమైన పూలల్లో ఒకటి. ఇవి ఎక్కువగా తెలుపు లేదా ఊదా రంగులో ఉంటాయి. వర్షాకాలంలో పూసే పూలల్లో ఇవి ఒకటి. ఇవి చాలా త్వరగా పెరుగుతాయి. వీటి విత్తనాలను నేలపై చల్లి తేమగా ఉంచడమే కాకుండా వారానికి ఒకసారి ఎరువులు వేయడం వలన ఈ మొక్కలు అద్భుతంగా పొడవుగా పెరిగి చెట్టునిండుగా పూలు పూస్తుంటాయి.
మందార పూలు : రంగు రంగుల పూలల్లో మందార పూలు కూడా ఒకటి. ఈ పూలు చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వివిధ రంగుల్లో రెండు మూడు రకాలుగా పూస్తుంటాయి. వర్షకాలంలో పూసే పూలల్లో ఈ పూలు కూడా ఒటి.
బంతి పూలు : బంతి పువ్వులు లేతపసుపు రంగు, నారింజ రంగులో ఉంటాయి. ఈ పూల మొక్కలను ఇంట్లో పెట్టుకోవడం వలన పాములు ఇంటికి రాకుండా ఉంటాయి. అంతే కాకుండా ఈ పువ్వులు మంచి సువాసనను ఇస్తాయి. అయితే బంతి పూలకు సూర్యకాంతితో పాటు ఎక్కువ నీరు అవసరం. అందుకే ఈ మొక్కలను నాటిన తర్వాత ఎక్కువగా నీరు పోస్తూ ఉండాలి. అలా చేయడం వలన త్వరగా పూలు పూస్తుంటాయి.
మల్లె పూలు : మంచి సువాసననిచ్చే పూల్లో మల్లె పూలు ఒకటి. ఈ పూలల్లో కూడా అనేక రకాలు ఉంటాయి. తీగ మల్లె, సన్నజాజి మల్లె, ఇలా అనేక రకాల మల్లెపూలు ఉంటాయి. అయితే వర్షకాలంలో పూసే పూలల్లో ఈ పూలు కూడా ఒకటి. ఈ మొక్కకు తేలికపటి సూర్యకాంతి చాలా అవసరం. ప్రతి రోజూ నీరు పోయడం వలన ఈ మొక్క వేపుగా పెరిగి, చెట్టునిండుగా పూలనిస్తుంది. అందుకే ఈ మొక్కను వర్షకాలంలో పెంచుకోవడం చాలా ఉత్తమం.