Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Ys Jagan On Singayya Death Case,Palnadu Accident: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు – police case on ysrcp chief ys jagan on palnadu singaiah accident issue

22 June 2025

తెలుగు రాష్ట్రలో కొనసాగుతున్న రప్పా, రప్పా ట్రెండ్.. పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం!

22 June 2025

రోజూ ఖాళీ కడుపుతో బెండకాయ నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?

22 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»TS POLICE: ఒకదాని వెంట మరొకటి నెమ్మదిగా వస్తున్న కార్లు.. ఆపి తనిఖీ చేయగా బయటపడ్డ భాగోతం!
తెలంగాణ

TS POLICE: ఒకదాని వెంట మరొకటి నెమ్మదిగా వస్తున్న కార్లు.. ఆపి తనిఖీ చేయగా బయటపడ్డ భాగోతం!

.By .22 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
TS POLICE: ఒకదాని వెంట మరొకటి నెమ్మదిగా వస్తున్న కార్లు.. ఆపి తనిఖీ చేయగా బయటపడ్డ భాగోతం!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మాదక ద్రవ్య నియంత్రణ శాఖ, ఎక్సైజ్ శాఖ పోలీసుల నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో ప్రమాదకర డ్రగ్స్ తరలిస్తోన్న ఐదుగురు నిందితులు అరెస్ట్ అయ్యారు. నిర్మల్‌ జిల్లా వద్ద నేషనల్‌ హైవేపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు కార్లలో ప్రమాదకర డ్రగ్స్ లభించాయి. దీంతో డ్రగ్స్‌ తరలిస్తున్న ఐదుగురి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 425 కిలోల క్లోరల్ హైడ్రేట్, 1.115 కిలోల అల్ప్రాజోలం, రెండు ఎర్టిగా కార్లు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మొత్తం డ్రగ్స్‌ విలువ రూ. 52 లక్షలుగా ఉండొచ్చని పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిలో డ్రైవర్ బసపల్లి రామ గౌడ్ (45) నిజామాబాద్‌కు చెందినవాడు కాగా.. మిగిలిన నలుగురు బుర్ర రమేష్ (36), కొట్టగిరి రాజం (59), ఎల్లందుల శ్రీనివాస్ (44), బుర్ర రాజశేఖర్ (34) కరీంనగర్‌కు చెందినవారిగా గుర్తించారు. వీరంతా తాటికల్లు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తారని పోలీసులు తెలిపారు.

కాగా వీరంగా మహారాష్ట్రలోని థానే జిల్లా నింబవాలి గ్రామంలో రహస్యంగా మాదక ద్రవ్యాలను తయారు చేసి.. తెలంగాణలో తాటికల్లు దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. క్లోరల్ హైడ్రేట్, అల్ప్రాజోలం వంటి ప్రమాదకర డ్రగ్స్‌ను ఉపయోగించి నకిలీ తాటికల్లు తయారు చేసి మార్కెట్‌లో విక్రయించడమే వీళ్ల వ్యాపారం అని పోలీసులు తెలిపారు. అయితే నిజామాబాద్‌కు చెందిన రామ గౌడ్ అనే వ్యక్తి 2024 జనవరిలోనూ ఇదే తరహా డ్రగ్స్ సరఫరా చేస్తూ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాడని… జైలు నుండి విడుదలైన తర్వాత అతను కొత్తగా గ్యాంగ్ ఏర్పాటు చేసి.. మరోసారి తన దందాను కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ గ్యాంగ్‌ సరఫరా చేసే క్లోరల్ హైడ్రేట్‌ను నిద్రలేమి, ఆందోళన తగ్గించడానికి ఉపయోగిస్తారు. అల్ప్రాజోలం అత్యంత ప్రమాదకరమైన మాదకద్రవ్యం. దీన్ని ఎక్కువగా వాడితే కిడ్నీ, కాలేయ సమస్యలతో పాటు మరణం కూడా సంభవించవచ్చని అధికారులు చెబుతున్నారు. మాదక ద్రవ్యాలు అనేక కుటుంబాలను దెబ్బతీస్తున్నాయని.. యువత, విద్యార్థులు ఇలాంటి చెడు అలవాట్లు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై నిఘా ఉంచాలని TSNAB అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా డ్రగ్స్ సంబంధిత అనుమానాస్పద కార్యకలాపాలను గమనిస్తే 8712671111 నంబర్‌కు సమాచారం అందించాలని అధికారులు కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

తెలుగు రాష్ట్రలో కొనసాగుతున్న రప్పా, రప్పా ట్రెండ్.. పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం!

22 June 2025

Rains: వానమ్మా..! నీ జాడ ఏదమ్మా..? ముందుగానే పలకరించినా పనికిరాని తొలకరి

22 June 2025

South Central Railway: షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఆ రోజు నుంచి అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు!

22 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Ys Jagan On Singayya Death Case,Palnadu Accident: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు – police case on ysrcp chief ys jagan on palnadu singaiah accident issue

22 June 2025

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా…

తెలుగు రాష్ట్రలో కొనసాగుతున్న రప్పా, రప్పా ట్రెండ్.. పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం!

22 June 2025

రోజూ ఖాళీ కడుపుతో బెండకాయ నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?

22 June 2025

చనిపోయిందనుకొని అంత్యక్రియలు చేశారు.. కట్‌చేస్తే.. నెల రోజుల తర్వాత..

22 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Ys Jagan On Singayya Death Case,Palnadu Accident: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు – police case on ysrcp chief ys jagan on palnadu singaiah accident issue

22 June 2025

తెలుగు రాష్ట్రలో కొనసాగుతున్న రప్పా, రప్పా ట్రెండ్.. పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం!

22 June 2025

రోజూ ఖాళీ కడుపుతో బెండకాయ నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?

22 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.