చిన్న కరివేపాకుతో పెద్ద ఫలితాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతుంటారు. ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేసే కరివేపాకు ఆకులను జ్యూస్గా చేసుకుని ఖాళీ కడుపుతో తాగితే శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. ఉదయాన్నే కరివేపాకు రసం తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది బరువు తగ్గటం.
ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల డైజెషన్ మెరుగవుతుంది. బరువు పెరగడానికి ముఖ్య కారణాల్లో ఒకటి జీర్ణ సమస్యలు, మలబద్ధకం. కరివేపాకు జ్యూస్ని తీసుకోవడం వల్ల ఈ రెండూ సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మెటబాలిజం పెరుగుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.
ఇందుకోసం 10 కరివేపాకులు, గోరువెచ్చని నీరు తీసుకోవాలి. ముందుగా కరివేపాకుని గ్రైండ్ చేసి, గోరువెచ్చటి నీటిలో వేసి.. ఉదయాన్నే తాగాలి. ఈ జ్యూస్ రోజు తాగడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు..టాక్సిన్స్ బయటకు పోతాయి. అంతేకాదు ఈ జ్యూస్.. జుట్టు, చర్మానికి కూడా మంచిది.
కరివేపాకులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి వరం లాంటింది. ఇందులో విటమిన్ బి2, విటమిన్ బి1, విటమిన్ ఎ వంటి విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు, ఐరన్, కాల్షియం, ప్రోటీన్, మినరల్స్ కూడా ఉన్నాయి. ఇందులోని గుణాలు చాలా ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తాయి.
కరివేపాకు జ్యూస్ తీసుకోవడం వల్ల లివర్ డీటాక్స్ అవుతుంది. లివర్ సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. రెగ్యులర్గా తీసుకుంటే లివర్ సమస్యలు రాకుండా ఉంటాయి. కరివేపాకులో ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. దీని వల్ల మంట, వాపు వంటి సమస్యలు ఉండవు.