తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ ఐటీ శాఖ మంత్రి నాారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం బనకచర్ల ప్రాజెక్టు వివాదం నడుస్తోంది. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుండగా.. తెలంగాణ అడ్డుచెప్తోంది. బనకచర్ల ప్రాెజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పరిణామాల మధ్య నారా లోకేష్.. తెలంగాాణ ప్రభుత్వానికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పారో ఇప్పుడు చూద్దాం..

*మాట నిలబెట్టుకున్న నారా లోకేష్.. వారికి ప్రతి నెలా డబ్బులు..
హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ సరైన నిర్వహణ లేకపోవటంతో కాస్త దెబ్బతింది. ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఎన్టీఆర్ ఘాట్ను మంత్రి నారా లోకేష్ సందర్శించారు. దివంగత ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. అయితే ఎన్టీఆర్ ఘాట్లో కట్టడాలు దెబ్బతినడం, గ్రిల్స్ పడిపోవడం గమనించిన నారా లోకేష్ ఈ విషయంపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. అవసరమైతే ఎన్టీఆర్ ఘాట్ను.. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో బాగు చేస్తామని నారా లోకేష్ అన్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి కోరుతూ లేఖ రాయాలని ప్రతినిధులకు నారా లోకేష్ సూచించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఘాట్ మీద హెచ్ఎండీఏ అధికారులు దృష్టిసారించారు.
*బాబుకు మోదీ రిటర్న్ గిఫ్ట్.. త్వరలోనే నారా లోకేష్కు ప్రమోషన్..? మరి పవన్ సంగతేంటి?
తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. సీఎం రేవంత్రెడ్డికి లోకేష్ థ్యాంక్స్.. అసలు కారణమదే!
ఎన్టీఆర్ ఘాట్లో హెచ్ఎండీఏ అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. రూ.1.30 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ ఘాట్ను అభివృద్ధి చేస్తున్నారు. ఎన్టీఆర్ ఘాట్ ముఖద్వారం నుంచి ఎన్టీఆర్ సమాధి వరకూ అన్నింటికీ మరమ్మత్తులు చేస్తున్నారు. త్వరలోనే ఎన్టీఆర్ ఘాట్కు కొత్త రంగులు వేయనున్నారు. దెబ్బతిన్న అంతర్గత రహదారులకు మరమ్మత్తులు చేయనున్నారు. రెండు నెలల్లోగా ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే సందర్శకులను ఎన్టీఆర్ ఘాట్ వద్దకు అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వానికి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా నారా లోకేష్ ట్వీట్ చేశారు.
*లోకేష్ కెరీర్ను చంద్రబాబు నాశనం చేస్తున్నారు: అసదుద్దీన్ ఒవైసీ
“తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదం..తెలుగు జాతి వెలుగు సంతకం..విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహా నాయకుడు ఎన్టీఆర్ స్మృతివనం అయిన ఎన్టీఆర్ ఘాట్కు రూ.1.35 కోట్ల వ్యయంతో హెచ్ఎండిఏ మరమ్మతులు చేపట్టడం చాలా సంతోషం. ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.” అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.