వర్షాకాలం ఉష్ణోగ్రతలు పడిపోవటంతో రోజంతా చల్లగా ఉంటుంది. దీనికి తోడు రోజంతా చిరుజల్లులు పడుతుంటాయి. కనుక, దాహం వేయటం కూడా తక్కువగానే ఉంటుంది. దీంతో ఈ రోజుల్లో తక్కువ మంచినీళ్లు తాగితే చాలని చాలామంది అనుకుంటారు. కానీ, ఇది అపోహ మాత్రమేనని, మన శరీర అవసరాలకు తగినంత నీటిని తాగటం తప్పని సరి అని వైద్యులు చెబుతున్నారు. తగినంత నీరు తాగకపోవటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి, అది సైలెంట్ డీహైడ్రేషన్కు దారి తీస్తుందని, దీంతో మనిషి నీరస పడిపోవటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి దాహం వేయకపోయినా వానాకాలంలో తగినంత నీరు తాగడం ముఖ్యం. వర్షాకాలంలో వేడివేడిగా రోడ్డు వెంట అప్పటికప్పుడు వేడివేడిగా వేసే ఓ మిరపకాయ బజ్జీలో, ఫాస్ట్ ఫుడ్ వంటిదో లాగిస్తే.. ఏమీ కాదని చాలామంది అనుకుంటారు. అయితే, ఆహారం వేడిగా ఉన్నంత మాత్రాన ఏమీ కాదని అనుకోవడం అపోహ మాత్రమేనని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆరుబయట, బండ్ల మీద దొరికే చిరుతిళ్ల తయారీదారులు శుభ్రతను పాటించరని, కనుక వీటికి దూరంగా ఉండటం మంచిదని, దీనికి బదులు ఇంట్లోనే వేడివేడిగా నచ్చిన చిరుతిండ్లు చేసుకొని తినటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా.. హోటళ్లల్లో వడ్డించే సలాడ్లో అందించే పచ్చి కూరగాయలను శుభ్రంగా నీటిలో కడిగారో లేదో చెప్పలేమని, కనుక ఈ సీజన్లో బయట దొరికే ఇలాంటి సలాడ్ల జోలికి పోవద్దని చెబుతున్నారు. వీటి వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఎక్కువని కూడా వారు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కలిసి మందు కొట్టారు.. పిల్లలిద్దరికీ పెళ్లి చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే..
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్.. అదిరిపోయే ఆఫర్ గురూ
క్లాస్ రూమ్లో శ్రద్ధగా చదువుకుంటున్న విద్యార్థులు.. ఉన్నట్టుండి హాజరైన అనుకోని అతిధి.. కట్ చేస్తే
మరోసారి జంటగా కనిపించిన విజయ్దేవరకొండ-రష్మిక.. ఈసారి
ఘోరమైన యాక్సిడెంట్!! చావు నుంచి బయటపడ్డ గీతూ రాయల్