ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించినట్టు ఆయన పేర్కొన్నారు. సీజ్ ఫైర్కు రెండు దేశాలు అంగీకరించడంతో 12 రోజులుగా కొనసాగుతున్నయుద్దం ముగిసిందంటూ ట్రంప్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ ద్వారా తెలిపారు. ఇప్పటికే రెండు దేశాలు కాల్పుల విరమణకు వచ్చాయని మరో 24 గంటల్లో పూర్తిగా యుద్దం ముగుస్తుందని ట్రంప్ పేర్కొన్నాడు.