AP Village Ward Sachivalayam Employees Rule: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలో పనిచేసే ఉద్యోగులను సొంత వార్డుల్లో కాకుండా ఇతర వార్డులకు బదిలీ చేయాలని ఆదేశించింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయగా, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. APIIATP కింద పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ టెండర్ల పర్యవేక్షణకు సాంకేతిక కమిటీని పునరుద్ధరించింది.
హైలైట్:
- ఏపీ వార్డు సచివాలయాల ఉద్యోగులకు పండగే
- బదిలీలపై క్లారిటీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- ఆ కొత్త రూల్ వారికి వర్తించదని చెబుతూ స్పష్టత

ఏపీ సచివాలయాల ఉద్యోగులకు పండగే.. బదిలీల్లో కొత్త రూల్ వర్తించదు, హమ్మయ్యా నో టెన్షన్
ఏపీ ప్రభుత్వం మరికొన్ని అప్డేట్స్
మరోవైపు విద్యార్థుల మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, ఆత్మహత్యల నివారణకు జాతీయ స్థాయిలో ఏర్పాటుచేసిన టాస్క్ఫోర్స్తో సమన్వయం చేసేందుకు కళాశాల విద్యా డైరెక్టర్ నారాయణ భరత్గుప్తాను నియమించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు కేంద్రం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రభట్ అధ్యక్షతన టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. జులై 12 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సమగ్ర శిక్షా అభియాన్ సూచించింది. 6-14 ఏళ్ల పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బడి బయట ఉండే పిల్లల్ని గుర్తించి వారందరూ బడిలో ఉండేలా చూడాలని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటిపారుదల, వ్యవసాయ మార్పిడి పథకం (APIIATP) కింద పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికోసం రూ.20.64 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసింది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ పాలనామోద ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (APADCL) నిర్వహించే టెండర్ల పర్యవేక్షణ కోసం సాంకేతిక కమిటీని ప్రభుత్వం మళ్లీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో APADCL ఎండీ, APIIC, పంచాయతీరాజ్, మారిటైం బోర్డు మరియు ఇతర శాఖలకు చెందిన 12 మంది సభ్యులు ఉంటారు.