AP High Court On Guntur Degree Results: కాలేజీల తప్పులకు విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టకూడదని ఏపీ హైకోర్టు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి స్పష్టం చేసింది. 2022-25 బ్యాచ్ విద్యార్థుల 6వ సెమిస్టర్ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అఫిలియేషన్ ఫీజులు చెల్లించలేదన్న కారణంతో ఫలితాలు ఆపడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. డబ్బులు రాబట్టుకోవడానికి ఇతర మార్గాలను చూడాలని సూచించింది. విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పింది.
హైలైట్:
- ANU డిగ్రీ ఫలితాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
- వెంటనే ఫలితాలు విడుదల చేయాలన్న ఏపీ హైకోర్టు
- కాలేజీలు తప్పు చేస్తే విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టొద్దు

కాలేజీలు తప్పు చేస్తే విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టొద్దు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
దీంతో ఈ పిటిషన్పై విచారణను న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈ నెల 26కి వాయిదా వేశారు. యూనివర్శిటీ రిజిస్ట్రార్తో మాట్లాడి సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఏజీకి సూచించారు. తదుపరి విచారణకు రిజిస్ట్రార్ హాజరుకావాల్సిన అవసరం లేదని తెలిపారు. ఏపీ హైకోర్టు ఫలితాలు విడుదల చేయాలన్న ఆదేశాలపై వర్శిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.. మరోవైపు ఏపీ హైకోర్టు ఫలితాలు విడుదల చేయాలన్న ఆదేశాలను డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు స్వాగతించాయి.