సోషల్ మీడియా ప్రపంచం వేల,మిలియన్ల వీడియోలతో నిండి ఉంది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వీడియోలు షేర్ చేయబడే వేదిక ఇది. వాటిలో కొన్ని మిమ్మల్ని నవ్విస్తాయి. మరిన్ని ఒళ్లు గగ్గుర్పాటుకు గురిచేస్తాయి. ప్రజల జీవితాలు ప్రమాదంలో ఉన్నప్పుడు అజాగ్రత్తకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో అనేకం కనిపిస్తున్నాయి. మీరు నమ్మరు కానీ అలాంటి ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు బయటపడింది. అజాగ్రత్త కారణంగా ఒక వ్యక్తి మరుగుతున్న నూనెలో పడకుండా తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డాడు. వీడియో మాత్రం నెట్టింట వేగంగా వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో ఒక వ్యక్తి, తన స్నేహితుల బృందంతో కలిసి నదిలో చేపల వేటకు వెళ్లాడని తెలుస్తుంది. అలాగే, వారు పట్టుకున్న చేపల్ని అక్కడే నీటి ఒడ్డునే ఫ్రై చేసుకుని తినేందుకు రెడీ చేసుకుంటున్నారు. ఆ ఒడ్డునే కట్టెలతో పొయ్యి ఏర్పాటు చేసుకున్నారు. నిప్పు వెలిగించి పాన్లో నూనె పోసి మరిగించారు. ఇంకా ఫ్రేమ్లో ఒక వ్యక్తి చేతిలో వేయించాల్సిన చేపను పట్టుకుని ఆ పొయ్యి వద్దకు వచ్చాడు. పాన్ దగ్గరికి చేరుకున్న అతడు.. ఆ నూనె ఎంత వేడిగా ఉందో ఊహించలేదు. ఎదురుగా వీడియో తీస్తున్న కెమెరాకు ఫోజులిస్తూ.. అతడు చేపను పొయ్యిపై ఉన్న నూనెలో వేస్తాడు. దాంతో ఒక్కసారిగా ఆ కాడాయ్లోంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. చేపతో పాటుగా ఆ యువకుడి ముఖానికి మంటలంటుకున్నాయి.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి…
కానీ, అదృష్టవశాత్తు తృటిలో అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అతడు చేపను మరిగే నూనెలో వేయగానే, పాన్లోని నూనె అగ్నిపర్వతంలా ఉప్పొంగింది. దాని నుండి ప్రమాదకరంగా మంటలు వ్యాపించాయి. ఆ మంట అతడి ముఖానికి కూడా అంటుకోవడంతో అతడు వెంటనే నదిలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. లేదంటే, చేపలను వేయించడానికి బదులుగా ఆ వ్యక్తి తానే స్వయంగా మంటల్లో కాలిపోయేవాడు. వైరల్ వీడియోను ఇన్స్టాగ్రామ్లో ronielsouza21 అనే హ్యాండిల్ నుండి షేర్ చేయగా, మిలియన్ల కొద్దీ వీడియోలు, లైక్లను సేకరించింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..