Chengalpattu Express Robbery: ఆంధ్రప్రదేశ్లో ఎక్స్ప్రెస్ రైళ్లు మరోసారి దొంగల టార్గెట్గా మారాయి. అనంతపురం జిల్లాలో చెంగల్పట్టు ఎక్స్ప్రెస్లో భారీ చోరీ జరిగింది. దుండగులు సిగ్నల్ కేబుల్ కట్ చేసి రైలును ఆపి ప్రయాణికులను బెదిరించి దోచుకున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో పద్మావతి ఎక్స్ప్రెస్లో కూడా ఇదే తరహా దోపిడీ జరిగింది, ప్రయాణికుల నుంచి బంగారం, నగదు అపహరించారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైలైట్:
- ఏపీలో మరోసారి రెచ్చిపోయిన దొంగలు
- చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ రైల్లో దోపిడీ
- వారం వ్యవధిలో రెండోసారి చోరీ ఘటన

ఏపీలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. చెంగల్పట్టు ఎక్స్ప్రెస్లో చోరీ, సిగ్నల్స్ కట్ చేసి మరీ
ఎస్-2 బోగీలో ఖమ్మం నుంచి తిరుపతి వెళ్తున్న కుమారి మెడలోని బంగారాన్ని దొంగలు లాక్కెళ్లారు. అలాగే ఎస్-4 బోగీలో సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న వరలక్ష్మి హ్యాండ్బ్యాగ్ను దొంగలు ఎత్తుకెళ్లారు. ఎస్-5 బోగీలో ఖమ్మం నుచి తిరుపతి వెళ్తున్న కె.ఉమ మెడలోని బంగారు దండను లాక్కోడానికి ప్రయత్నించారు.. ఈ క్రమంలో ఐదు గ్రాముల బంగారం పోయింది. దొంగలు రైల్లోని ముగ్గురు మహిళల నుంచి 40 గ్రాముల బంగారం, రెండు వేల రూపాయల నగదు, ఒక మొబైల్ ఎత్తుకెళ్లారు. పద్మావతి ఎక్స్ప్రెస్ రైల్లో చోరీ జరిగిందని..కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు చెబుతున్నారు.