Another Case on YS Jagan over Guntur mirchi yard visit: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద మరో కేసు నమోదైంది. సింగయ్య మృతి అంశంలో ఇప్పటికే జగన్ మీద పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు సంబంధించి వైఎస్ జగన్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అనుమతి లేకుండా వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించారని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో.. వైసీపీ నేతలు అనుమతి లేకుండా గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు వెళ్లారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్తో పాటుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగల వేణుగోపాల్రెడ్డి, కావటి మనోహర్ నాయుడులపై కేసు నమోదైంది. వైసీపీ నేతలకు 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. విచారణ కోసం పిలిచినప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్కు రావాలని పోలీసులు నోటీసుల్లో స్పష్టం చేశారు.
YSRCP: వైసీపీకి మరో షాక్.. వైఎస్ జగన్ మీద మరో కేసు.. 4 నెలల కిందటి ఘటనపై.!
ఫిబ్రవరి 19న వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. మిర్చి రైతులను పరామర్శించారు. అయితే ఆ సమయంలో గుంటూరు – కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కోడ్ నేపథ్యంలో భారీ ర్యాలీలకు అనుమతి ఉండదు. కానీ వైఎస్ జగన్.. వైసీపీ శ్రేణులతో కలిసి అనుమతి లేకుండానే మిర్చి యార్డుకు వచ్చారని కేసు నమోదైంది.
కేసు విచారణలో భాగంగానే పలువురు వైసీపీ నేతకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. పిలిచినప్పుడు విచారణకు రావాలని నల్లపాడు పోలీసులు నోటీసుల్లో పేర్కొంటున్నారు. అయితే వైఎస్ జగన్కు కూడా నోటీసులు ఇస్తారా అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు వైఎస్ జగన్ మిర్చి యార్డు పర్యటన సమయంలో ఆగంతకులు కొన్ని మిర్చి బస్తాలను ఎత్తుకెళ్లారనే ఆరోపణలు వచ్చాయి.
వైఎస్ జగన్ మీద ఇప్పటికే సింగయ్య మృతికి సంబంధించి కేసు నమోదైంది. వైఎస్ జగన్ కారు కిందపడే సింగయ్య చనిపోయారని గుంటూరు పోలీసులు చెప్తున్నారు. దీనిపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ మీద మరో కేసు నమోదు కావటం ప్రాధాన్యం సంతరించుకుంది.