చేసిందే ఒక్క సినిమా.. కానీ తెలుగులో కావాల్సినంత గుర్తింపు తెచ్చుకున్నారు జాన్వీ కపూర్. దేవర సినిమాలో తంగం పాత్రతో బాగానే చేరువయ్యారు ఈ బ్యూటీ. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తున్నారు.
బాలీవుడ్ కంటే తెలుగులోనే ఈ భామకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. పెద్దితో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేరిపోవాలని చూస్తున్నారు జాన్వీ. పెద్ది సెట్స్పై ఉండగానే.. అల్లు అర్జున్, అట్లీ సినిమాలోనూ జాన్వీకి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.
ఇందులో మృణాళ్, దీపికతో కలిసి నటించబోతున్నారు జాన్వీ. మరోవైపు హిందీలోనూ బిజీగానే ఉన్నారు ఈ భామ. కెరీర్లో ఇంత బిజీగా ఉన్నా.. పర్సనల్ లైఫ్ మాత్రం మిస్ అవ్వరు ఈ బ్యూటీ.
తాజాగా లండన్లో చెల్లి ఖుషీ, బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు జాన్వీ.కొన్నేళ్లుగా శిఖర్ పహారియాతో డేటింగ్ చేస్తున్నారు జాన్వీ. ఈ మధ్య ప్రియుడుతో కలిసి లండన్ వెళ్లారు జాన్వీ.
ఈ ఇద్దరి ఫోటోలు వైరల్ అవుతున్నాయిప్పుడు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు పర్సనల్ లైఫ్కి ఇవ్వాల్సిన టైమ్ ఇస్తున్నారు జాన్వీ. ఈ బ్యాలెన్సింగ్ చాలా మంది హీరోయిన్లకు రాదు.. అందులో త్వరగానే ఆరితేరిపోయారు జాన్వీ కపూర్.