రష్మిక మందన్న.. కేరాఫ్ విక్టరీ. ఈమె అడుగు పెడితే బొమ్మ బ్లాక్బస్టర్ అంతే. 8 ఏళ్ళ కెరీర్లో 90 పర్సెంట్ సక్సెస్ రేట్ మెయింటేన్ చేస్తున్నారు నేషనల్ క్రష్. ఇంత పోటీలో ఇదేం చిన్న విషయం కాదు.
తాజాగా కుబేరలోనూ తన పర్ఫార్మెన్స్తో మరోసారి మాయ చేసారు రష్మిక. ఇంత సీరియస్ సినిమాలో కామెడీతో నవ్వించారు ఈ భామ. కుబేర సక్సెస్ మీట్లో రష్మిక మందన్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు.
నాగార్జున అయితే ఈ భామకు ఫ్రీగా పిఆర్ చేసి పెడుతున్నారు. 2000 కోట్ల స్టార్ అంటూ ప్రతీసారి గుర్తు చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి సైతం రష్మికను చూసి తెగ మురిసిపోయారు.
చూడాలని ఉందిలో సౌందర్య గుర్తుకొచ్చిందని పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు.. నాగ్ సైతం క్షణక్షణంలో శ్రీదేవి గుర్తొచ్చిందన్నారు. గత ఏడాదిగా రష్మిక ఫామ్ మామూలుగా లేదు. యానిమల్, పుష్ప 2, ఛావా.. తాజాగా కుబేరా సినిమాలతో నెంబర్ వన్ అయిపోయారు.
రష్మికకు పోటీ ఇచ్చే హీరోయిన్ కూడా దగ్గర్లో ఎవరూ లేరు. పాన్ ఇండియన్ సంచలనంగా మారిపోయారు ఈ కన్నడ బ్యూటీ. ప్రస్తుతం రెయిన్ బో, గాళ్ ఫ్రెండ్ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్నారు రష్మిక మందన్న.