సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో కనిపించింది. దీనిని చూసిన తర్వాత ఇంటర్నెట్ వినియోగదారులు ఇది పాకిస్తాన్లో మాత్రమే సాధ్యమని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో మొత్తం కుటుంబం ఒకే బైక్పై ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇక్కడ నెటిజన్లను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. బైక్కి అమర్చిన దేశీ జుగాడ్ ట్రాలీ.. అందులో ఆరుగురు పిల్లలు కూర్చున్నారు.
ఈ వీడియో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ కి చెందినదిగా చెప్పబడుతోంది. దీనిని ఆటోలో కూర్చున్న ప్రయాణీకుడు రికార్డ్ చేశాడు. ఈ వీడియోలో డ్రైవర్తో పాటు నలుగురు వ్యక్తులు బైక్పై ప్రయాణిస్తున్నట్లు స్పష్టంగా చూడవచ్చు. ఇద్దరు మహిళలు,ఒక పిల్లవాడు. ఇది మాత్రమే కాదు ఈ కుటుంబం వారి బైక్ వెనుక భాగంలో ఒక వీల్ ట్రాలీ లాంటి దేశీ జుగాద్ను కూడా అమర్చారు. ఆ ట్రాలీలో ఇంట్లోని మరో ఆరుగురు పిల్లలు కూడా కూర్చున్నారు. ఇలా ఒకేసారి మొత్తం పది మంది ఒకే బైక్పై ప్రయాణిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పాకిస్తానీ వ్యక్తికి చెందిన ఈ అద్భుతమైన దేశీ జుగాద్ వీడియో గురించి సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కొంతమందికి ఈ వీడియో ఆసక్తికరంగా అనిపిస్తుండగా.. మరోవైపు ఇది ట్రాఫిక్ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఈ వ్యక్తులు తమ ప్రాణాలను ప్రమాదంలో పడేయడమే కాకుండా, ఇతరులకు కూడా ప్రమాదం సృష్టిస్తున్నారని అంటున్నారు.
వీడియోను ఇక్కడ చూడండి
ప్రజలు దీనిని మరణ మార్గం అని పిలిచారు!
ఈ వీడియోను @soo_funny_memes అనే ఖాతాలో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దీనిపై ప్రజలు తీవ్రమైన వ్యాఖ్యలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక వినియోగదారుడు ఇలా వ్రాశాడు, ‘ఇలాంటి తల్లిదండ్రులను నేరుగా జైలుకు పంపాలి. వారు తమ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు.’ మరొక వినియోగదారుడు ఇలాంటి దృశ్యం పాకిస్తాన్లో మాత్రమే కనిపిస్తుంది అని అన్నారు. మరొక వినియోగదారుడు దీనిని ‘మరణ జుగాద్’ అని కూడా కామెంట్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..