Gold And Silver Price In Hyderabad – Vijayawada: బంగారం ధరలు ఆల్టైమ్ గరిష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా.. తులం పసిడి ధర లక్ష మార్కు దాటి పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే బంగారం ధర రెండు రోజుల నుంచి దిగివస్తూ కాస్త ఊరటనిస్తోంది. కాగా.. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం, అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి, ముడిచమురు ధరలు పెరగడం వంటి అంశాలు పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. అటు వెండి ధరలు కూడా గరిష్ట స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి. అయితే.. బులియన్ మార్కెట్లో పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. వీటి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. జూన్ 25 2025 బుధవారం ఉదయం వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.99,210 ఉండగా.. 22 క్యారెట్ల ధర 90,940 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,08,900లుగా ఉంది.
ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,210 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,940 లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,18,900లుగా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.99,210 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.90,940లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,18,900 లుగా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.99,360, 22 క్యారెట్ల ధర రూ.91,090 లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,08,900లుగా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.99,210, 22 క్యారెట్ల ధర రూ.90,940 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,08,900లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.99,210 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,940 లుగా ఉంది. వెండి ధర కిలో రూ.1,18,900 లుగా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.99,210, 22 క్యారెట్ల ధర రూ.90,940 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,08,900 లుగా ఉంది.
గమనిక, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు.. ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..