Srisailam Temple Free Sparsha Darshan July 1st: శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త! వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మల్లన్న స్పర్శ దర్శనం తిరిగి ప్రారంభం కానుంది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకు భక్తులు స్వామిని తాకే అవకాశం ఉంది. కంప్యూటరైజ్డ్ టోకెన్ విధానం ద్వారా రోజుకు 1,000 నుంచి 1,200 మందికి దర్శనం కల్పిస్తారు. ఉత్సవాలు, పండుగలు, సెలవు రోజుల్లో ఈ దర్శనం ఉండదు.
హైలైట్:
- శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త
- మళ్లీ ఉచిత స్పర్శ దర్శనాలు
- జులై 1 నుంచి ప్రారంభిస్తారు

శ్రీశైలంలో బాంబులు, బుల్లెట్లు కలకలం రేపాయి. సోమవారం మధ్యాహ్నం వాసవీ సత్రం ఎదురుగా కనిపించాయి. సత్రం ముందు నుంచి వెళ్తున్న కొందరు స్థానికులు డివైడర్పై సంచిని చూశారు. అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు చెప్పారు. శ్రీశైలం పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాంబు స్క్వాడ్ సిబ్బందితో కలిసి సంచిని తనిఖీ చేశారు. అందులో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. సంచిలో 9 పెద్ద బుల్లెట్లు, 4 చిన్న బుల్లెట్లు ఉన్నాయి. వాటితో పాటు మరో 4 బాంబులను కూడా గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఈ బుల్లెట్లు పోలీసులవేనని ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ తెలిపారు.
శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త.. ఇకపై ఉచితంగానే, మల్లన్న స్వామిని తాకే అద్భుత అవకాశం
ఎల్లప్ప అనే పోలీస్కు శ్రీశైంలో డ్యూటీ కోసం పంపారు.. ఈ క్రమంలో ఆయనకు కేటాయించిన బుల్లెట్లను సంచిలో వేసుకుని శ్రీశైలం వచ్చారు. అయితే రోడ్డు పక్కన డివైడర్ దగ్గర ఫోన్ మాట్లాడుతూ ఆ సంచిని డివైడర్ మధ్యలో మర్చిపోయారు.. అయితే ఎల్లప్ప భయంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదన్నారు. ఎల్లప్ప ఈ నెలాఖరుకు రిటైర్ అవుతున్నారని.. ఆయనకు జాతకాల పిచ్చి ఎక్కువన్నారు. ఈ క్రమంలోనే ఆ సంచిలో ఎర్రటి వస్త్రాన్ని ఉంచారన్నారు. అలాగే ఆయన బ్యాగులో ఉన్న బాంబులు బాణసంచా బాంబులని తెలిపారు.